NIA: కేరళలో ఎన్ఐఏ రైడ్స్.. పీఎఫ్ఐ లక్ష్యంగా 56 చోట్ల దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA raids 56 places in Kerala linked to PFI leaders, members: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. గురువారం ఉదయం నాలుగు గంటల నుంచే కేరళ వ్యాప్తంగా రైడ్స్ చేస్తోంది. పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు నిర్వహిస్తోంది. మొత్తం 56 చోట్ల ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఇటీవల పీఎఫ్ఐని భారత ప్రభుత్వం నిషేధించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పాటు అక్రమ నిధులు కేసులో ఎన్ఐఏ, ఈడీలు విచారణ జరపుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పీఎఫ్ఐపై దాడులు నిర్వహించిన ఎన్ఐఏ మరోసారి పీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు, సభ్యులు, ఇతర కార్యకర్తలు ఇళ్లలో సోదాలు చేస్తోంది.
తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, ఎర్నాకులం, అలప్పుజ, మలప్పురం జిల్లాల్లో దాడులు కొనసాగుతున్నాయి. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కొన్ని నెలల క్రితం 100కు పైగా మంది పీఎఫ్ఐ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఈ నిషేధిత సంస్థ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థతో టచ్ లో ఉందని.. వాటి ద్వారా నిధులు సేకరించేందు ప్రయత్నిస్తోందిన కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Read Also: Kidnapping Girl: జగిత్యాల జిల్లాలో కిడ్నాప్కలకలం.. బాలికను కారులో ఎక్కించుకుని..
ఇదిలా ఉంటే పీఎఫ్ఐ నిషేధం తరువాత వేరే పేరుతో తిరిగి సంస్థను స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతోనే తాజాగా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ లో ఉన్న పీఎఫ్ఐ సభ్యులు, సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తుండటంతో మరోసారి ఎన్ఐఏ వారిపై ఉక్కుపాదం మోపింది. కేరళలోనే యాక్టివ్ గా కార్యకలాపాలు జరుగుతుండటంతో ఎన్ఐఏ ఫోకస్ పెంచింది. ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా పీఎఫ్ఐ మతోన్మాదాన్ని పెంచిపోషిస్తోంది. దీంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పలు ఉగ్రవాద సంస్థలతో లింకులు పెట్టుకుంది.
దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, కర్ణాటకలో జరిగిన పలు హత్యల్లో పీఎఫ్ఐ హస్తం ఉంది. సంజిత్ (కేరళ, నవంబర్ 2021), వి-రామలింగం (తమిళనాడు, 2019), నందు (కేరళ, 2021), అభిమన్యు (కేరళ, 2018), బిబిన్ (కేరళ, 2017), శరత్ (కర్ణాటక, 2017), ఆర్.రుద్రేష్ (కర్ణాటక, 2016), ప్రవీణ్ పుయారి (కర్ణాటక, 2016), శశి కుమార్ (తమిళనాడు, 2016) ఇలా పలువురు హత్యలకు గురయ్యారు. వీటన్నింటి వెనక పీఎఫ్ఐ ఉంది.
తాజావార్తలు
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!