NIA: కేరళలో ఎన్ఐఏ రైడ్స్.. పీఎఫ్ఐ లక్ష్యంగా 56 చోట్ల దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA raids 56 places in Kerala linked to PFI leaders, members: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. గురువారం ఉదయం నాలుగు గంటల నుంచే కేరళ వ్యాప్తంగా రైడ్స్ చేస్తోంది. పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు నిర్వహిస్తోంది. మొత్తం 56 చోట్ల ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఇటీవల పీఎఫ్ఐని భారత ప్రభుత్వం నిషేధించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పాటు అక్రమ నిధులు కేసులో ఎన్ఐఏ, ఈడీలు విచారణ జరపుతున్నాయి. గతంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పీఎఫ్ఐపై దాడులు నిర్వహించిన ఎన్ఐఏ మరోసారి పీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు, సభ్యులు, ఇతర కార్యకర్తలు ఇళ్లలో సోదాలు చేస్తోంది.
తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, ఎర్నాకులం, అలప్పుజ, మలప్పురం జిల్లాల్లో దాడులు కొనసాగుతున్నాయి. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కొన్ని నెలల క్రితం 100కు పైగా మంది పీఎఫ్ఐ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. ఈ నిషేధిత సంస్థ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థతో టచ్ లో ఉందని.. వాటి ద్వారా నిధులు సేకరించేందు ప్రయత్నిస్తోందిన కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
Read Also: Kidnapping Girl: జగిత్యాల జిల్లాలో కిడ్నాప్కలకలం.. బాలికను కారులో ఎక్కించుకుని..
ఇదిలా ఉంటే పీఎఫ్ఐ నిషేధం తరువాత వేరే పేరుతో తిరిగి సంస్థను స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతోనే తాజాగా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ లో ఉన్న పీఎఫ్ఐ సభ్యులు, సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తుండటంతో మరోసారి ఎన్ఐఏ వారిపై ఉక్కుపాదం మోపింది. కేరళలోనే యాక్టివ్ గా కార్యకలాపాలు జరుగుతుండటంతో ఎన్ఐఏ ఫోకస్ పెంచింది. ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా పీఎఫ్ఐ మతోన్మాదాన్ని పెంచిపోషిస్తోంది. దీంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పలు ఉగ్రవాద సంస్థలతో లింకులు పెట్టుకుంది.
దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, కర్ణాటకలో జరిగిన పలు హత్యల్లో పీఎఫ్ఐ హస్తం ఉంది. సంజిత్ (కేరళ, నవంబర్ 2021), వి-రామలింగం (తమిళనాడు, 2019), నందు (కేరళ, 2021), అభిమన్యు (కేరళ, 2018), బిబిన్ (కేరళ, 2017), శరత్ (కర్ణాటక, 2017), ఆర్.రుద్రేష్ (కర్ణాటక, 2016), ప్రవీణ్ పుయారి (కర్ణాటక, 2016), శశి కుమార్ (తమిళనాడు, 2016) ఇలా పలువురు హత్యలకు గురయ్యారు. వీటన్నింటి వెనక పీఎఫ్ఐ ఉంది.
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!