NIA: శాన్ఫ్రాన్సిస్కో కాన్సులేట్పై దాడి కేసు.. పంజాబ్, హర్యాల్లో ఎన్ఐఏ దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలని భారత కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేసిన ఘటనను ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ మేరకు పంజాబ్, హర్యానాలోని 14 ప్రాంతాల్లో బుధవారం ఎన్ఐఏ సోదాలు చేసింది. పంజాబ్లోని మోగా, జలంధర్, లూథియానా, గురుదాస్పూర్, మొహాలీ, పాటియాలా, హర్యానాలోని కురుక్షేత్ర, యమునానగర్ జిల్లాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.
మార్చి 19, జూలై 2న శాన్ఫ్రాన్సిస్కో కాన్సులేట్పై జరిగిన దాడుల వెనక కుట్రను ఛేదించడానికి పలు ప్రదేశాల్లో రైడ్స్ చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ దాడిలో నేరపూరిత చొరబాటు, విధ్వంసం, ప్రజా ఆస్తులకు నష్టం, కాన్సులేట్ అధికారులను గాయపరచడం, భవనాలకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినట్లు అధికార ప్రతినిధి వెల్లడించారు.
Also Read
Read Also: ‘Panauti’ row: ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
తాజాగా రెండు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో విలువైన సమాచారంతో పాటు నేరారోపణ పత్రాలతో కూడిన డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. దాడి చేసిన వారిని గుర్తించి, వారిని విచారించిందేకు సిద్ధమవుతున్నామని, భారత వ్యతిరేక శక్తులకు బలమైన సందేశం పంపండంలో భాగంగా ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది.
మార్చి 18-19 మధ్య రాత్రి శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్పై కొన్ని ఖలిస్తాన్ అనుకూల శక్తులు దాడులు చేశాయి. ఈ దాడి తర్వాత జూలై 2న కాన్సులేట్ భవనానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాయి. ఈ కేసును విచారించేందుకు ఎన్ఐఏ ఆగస్టులో శాన్ఫ్రాన్సిస్కోను సందర్శించింది. ఈ దాడిలో పాల్గోన్న యూఎస్ సంస్థలు, వ్యక్తుల సమాచారాన్ని గుర్తించడానికి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!