NIA: ఉమేష్ కోల్హే హత్య కేసులో మహారాష్ట్రలో సోదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో అమరావతి ఉమేష్ కోల్హే హత్య కేసులో ఎన్ ఐ ఏ దూకుడు పెంచింది. ఏకంగా మహారాష్ట్రలోని 13 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. జూన్ 21న అమరావతిలో ఫార్మాసిస్ట్ ఉమేష్ కోల్హేను దుండగులు దారుణంగా హత్య చేశారు. సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్లే ఉమేష్ కోల్హేను హత్య చేశారని తెలిసింది. తాజాగా బుధవారం ఎన్ఐఏ సోదాలు నిర్వహించి అనుమానితులు, నిందితుల ఇళ్లలో డిజిటల్ పరికరాలు (మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డ్లు, మెమరీ కార్డ్లు, డీవీఆర్లు), విద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేసే కరపత్రాలు, కత్తులు, ఇతర నేరారోపణ పత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకుంది.
మొదట్లో ఇది సాధారణ దోపిడికి సంబంధించిన హత్యగానే పోలీసులు ప్రకటించినప్పటికీ.. తర్వాత దీంట్లో కుట్రకోణం దాగుందని తెలిసింది. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. అంతకుముందు అమరావతి ఎంపీ నవనీత్ రాణా ఈ హత్య గురించి కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఈ హత్యను పోలీసులు నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని.. అమరావతి సీపీపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ చేయడం వల్లే ఈ హత్య జరిగిందని ఆమె ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఉగ్రలింగులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
Read Also: Ather Energy: డీలర్షిప్ పేరుతో 12.50 లక్షల టోకరా!
ఇటీవల రాజస్థాన్ ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ హత్య జరిగింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకే ఈ హత్య చేశారు నిందితులు. ఈ హత్యలో పాకిస్తాన్ తో ఉగ్రసంబంధాలు బయటపడ్డాయి. నిందితులకు దావత్-ఏ-ఇస్లామీ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ తేల్చింది. ఈ ఘటన జరగడానికి ముందే ఉమేష్ కోల్హే హత్య జరిగింది. ప్రస్తుతం ఈ రెండు కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారిస్తోంది.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!