NIA: ఉమేష్ కోల్హే హత్య కేసులో మహారాష్ట్రలో సోదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో అమరావతి ఉమేష్ కోల్హే హత్య కేసులో ఎన్ ఐ ఏ దూకుడు పెంచింది. ఏకంగా మహారాష్ట్రలోని 13 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. జూన్ 21న అమరావతిలో ఫార్మాసిస్ట్ ఉమేష్ కోల్హేను దుండగులు దారుణంగా హత్య చేశారు. సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్లే ఉమేష్ కోల్హేను హత్య చేశారని తెలిసింది. తాజాగా బుధవారం ఎన్ఐఏ సోదాలు నిర్వహించి అనుమానితులు, నిందితుల ఇళ్లలో డిజిటల్ పరికరాలు (మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డ్లు, మెమరీ కార్డ్లు, డీవీఆర్లు), విద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేసే కరపత్రాలు, కత్తులు, ఇతర నేరారోపణ పత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకుంది.
మొదట్లో ఇది సాధారణ దోపిడికి సంబంధించిన హత్యగానే పోలీసులు ప్రకటించినప్పటికీ.. తర్వాత దీంట్లో కుట్రకోణం దాగుందని తెలిసింది. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. అంతకుముందు అమరావతి ఎంపీ నవనీత్ రాణా ఈ హత్య గురించి కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఈ హత్యను పోలీసులు నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని.. అమరావతి సీపీపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ చేయడం వల్లే ఈ హత్య జరిగిందని ఆమె ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఉగ్రలింగులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read
Read Also: Ather Energy: డీలర్షిప్ పేరుతో 12.50 లక్షల టోకరా!
ఇటీవల రాజస్థాన్ ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ హత్య జరిగింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకే ఈ హత్య చేశారు నిందితులు. ఈ హత్యలో పాకిస్తాన్ తో ఉగ్రసంబంధాలు బయటపడ్డాయి. నిందితులకు దావత్-ఏ-ఇస్లామీ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ తేల్చింది. ఈ ఘటన జరగడానికి ముందే ఉమేష్ కోల్హే హత్య జరిగింది. ప్రస్తుతం ఈ రెండు కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!