IT Raids: కరోనా తెచ్చిన తంట.. ‘డోలో’ తయారీ సంస్థపై ఐటీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న సమయంలో అనూహ్యంగా డోలో 650 టాబెట్ల అమ్మకాలు పెరిగిపోయాయి.. ప్రపంచ వ్యాప్తంగా డోలో పేరు మార్మోగిపోయింది.. డోలో 650 వేసుకుంటే చాలు.. కరోనా నుంచి తప్పించుకోవచ్చన ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆ మాత్రలను కొనుగోలు చేశారు.. భారత్లోనే కాదు.. విదేశాల్లోనూ డోలోకు డిమాండ్ పెరిగింది.. మైక్రో ల్యాబ్స్ నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు సైతం తరలివెళ్లాయి డోలో 650 టాబెట్లు.. అయితే, డోలోను తయారు చేసిన మైక్రో ల్యాబ్స్ పై ఇప్పుడు ఐటీ దాడులు చర్చగా మారాయి.. ఆదాయపన్ను ఎగగెట్టారని ఆరోపణలపై బెంగళూరులోని మైక్రో ల్యాబ్స్ కార్యాలయంతో పాటు దేశంలోని ఆ కంపెనీకి చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఐటీ అధికారులు..
Read Also: ICC Test Rankings: ఐసీసీ టాప్-10 నుంచి కోహ్లీ అవుట్.. ఆరేళ్ల తర్వాత తొలిసారి
Also Read
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
కరోనా పుణ్యమా అంటూ మైక్రో ల్యాబ్స్కు డోలో మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.. ఒకప్పుడు ఉండటానికి బెంగళూరులో సొంత ఇల్లు కూడా లేని మైక్రో ల్యాబ్స్ అదినేతలు దిలీప్ సురానా, ఆనంద్ సురానా.. ఇప్పుడు దేశంలోని 100 మంది శ్రీమంతుల జాబితాలో చేరారంటే.. దాని వెనుక డోలో మాత్ర ఉందని చెప్పాలి.. కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో ఏకంగా 350 కోట్ల డోలో 650 మాత్రలు విక్రయాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.. దీంతో.. ఒకే ఏడాదిలో దాదాపు రూ.450 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందట.. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే సాగింది.. అయితే, ఇప్పుడు మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్పై ఐటీ శాఖ దాడులు జరిపింది. ఢిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవాతో పాటు దేశవ్యాప్తంగా 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకేసారి జరిగిన ఈ దాడుల్లో 200 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులోని కంపెనీ కార్యాలయంలో జరిగిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కరోనా సమయంలో భారీగా వెనుకేసుకున్న ఆ సంస్థ.. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటోంది.. దీంతో, ఈ దాడులు నిర్వహించినట్టుగా సమాచారం..
తాజావార్తలు
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
-
Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!