రైతు నిరసలనపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ.. 4 రాష్ట్రాలకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ… రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ సరిహద్దులు నిరసనలతో హోరెత్తుతున్నాయి. రైతులు ఢిల్లీ రాకుండా రోడ్లను మూసేశారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నెలలతరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఇదే విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి, చుట్టూ తిరిగి చాలాదూరం ప్రయాణించాల్సి వస్తోందని జాతీయ మానవహక్కుల కమిషనర్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్రంతో పాటు నాలుగు రాష్ట్రాలను ఆదేశించింది.
ఇక రైతుల ఆందోళనలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం కన్పిస్తోందని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడింది. పారిశ్రామిక రంగంపై అన్నదాతల ఆందోళనల ప్రభావం అన్న అంశంపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఒక సమగ్ర నివేదికను వచ్చేనెల 10 లోగా సమర్పించాలని ఆదేశించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. కాగా, రైతుల ఆందోళనపై మొదట్లో పట్టించుకోని కేంద్రం.. ఆ తర్వాత కొన్ని దపాలుగా చర్చలు జరిపింది.. చర్చలు సఫలం కాకపోవడంతో.. రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!