Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Nhai Announces New Guidelines For Double Toll Fee On Non Fastag Vehicles

FASTag Alert: ముందువైపు అద్దం మీదే ఫాస్టాగ్‌.. లేకపోతే టోల్‌ రుసుం డబుల్..!

Published Date :July 19, 2024 , 9:01 am
By Chandra Shekhar Pamena
  • ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం..
  • ఫాస్టాగ్‌లను వాహనం విండ్‌షీల్డ్‌పై ఏర్పాటు చేయాలని ఆదేశాలు..
  • విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్‌ లేకపోతే డబుల్ టోల్ రుసుం వసూలు చేయాలని సూచన..
FASTag Alert: ముందువైపు అద్దం మీదే ఫాస్టాగ్‌.. లేకపోతే టోల్‌ రుసుం డబుల్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

FASTag Alert: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌లను వాహనం విండ్‌షీల్డ్‌పై ఏర్పాటు చేయకపోవడంతో టోల్‌గేట్ల దగ్గర చెల్లింపుల విషయంలో అంతరాయం కలుగుతుంది. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇకపై విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ స్టికర్‌ ఏర్పాటు చేయకపోతే.. టోల్‌లైన్‌లోకి ప్రవేశించే వాహనదారుల నుంచి డబుల్‌ టోల్‌ వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విండ్‌స్క్రీన్‌పై ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇన్‌స్టాల్ చేయకపోవడంతో టోల్ ప్లాజాల దగ్గర అనవసరమైన జాప్యాలు కొనసాగుతున్నాయని.. దాంతో ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది.

Read Also: Pakistan : భయపడిన పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వం..ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై నిషేధం

Also Read

  • Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
  • Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్‌లో హోరాహోరీ పోరు!
  • Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్‌లో హింస..
  • Air India to Cut Flights: ఎయిర్‌ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..

కాగా, ముందువైపు అద్దంపై ఫాస్టాగ్ స్టికర్ లేకపోతే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలు, రాయితీదారులకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ పొడ్యూసర్‌ని జారీ చేసింది. దీంతో ఫాస్టాగ్‌లను అమర్చని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ లేకుండా టోల్‌లేన్‌లోకి ప్రవేశిస్తే విధించే రుసుంలపై డబుల్ ఫీజులతో కూడిన బోర్డులు ప్రదర్శించాలని ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలు ఇచ్చింది. ఫాస్టాగ్‌లు లేని వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సీసీటీవీ ఫుటేజీలో సైతం రికార్డు చేయాలని వెల్లడించింది. దీంతో వాహనాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించవచ్చని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

Read Also: AP Disaster Management Authority: ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..

అయితే, ఫాస్టాగ్‌లను ఏర్పాటు చేసుకోలేకపోతే లావాదేవీల నిర్వహణకు అర్హత ఉండదని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సూచించింది. అలాంటి వారు రెట్టింపు టోల్ రుసుమును చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అలా చేసే వారిని బ్లాక్‌లిస్ట్‌ చేర్చ వచ్చని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. వివిధ పాయింట్ల నుంచి జారీ చేసే సమయంలో వాహనం విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ ఇన్‌స్టాల్‌ చేసినట్లుగా నిర్ధారించుకోవాలని ఆయా బ్యాంకులను సైతం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న వెయ్యి టోల్ ప్లాజాల దగ్గర సుమారు 45 వేల కిలో మీటర్ల జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో వాహనదారుల నుంచి టోల్‌ రూసుం వసూలు చేస్తున్నారు. దాదాపు 8 కోట్ల మంది నుంచి టోల్‌ వసూలు చేస్తున్నారు. ఫాస్టాగ్‌ దేశంలో ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • double toll fee
  • fastag
  • National Highways Authority Of India
  • New guidelines
  • NHAI

తాజావార్తలు

  • Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..

  • Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్‌లో హోరాహోరీ పోరు!

  • Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’

  • Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్‌లో హింస..

  • Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions