FASTag Alert: ముందువైపు అద్దం మీదే ఫాస్టాగ్.. లేకపోతే టోల్ రుసుం డబుల్..!
- ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం..
- ఫాస్టాగ్లను వాహనం విండ్షీల్డ్పై ఏర్పాటు చేయాలని ఆదేశాలు..
- విండ్షీల్డ్పై ఫాస్టాగ్ లేకపోతే డబుల్ టోల్ రుసుం వసూలు చేయాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FASTag Alert: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్లను వాహనం విండ్షీల్డ్పై ఏర్పాటు చేయకపోవడంతో టోల్గేట్ల దగ్గర చెల్లింపుల విషయంలో అంతరాయం కలుగుతుంది. ఈ క్రమంలో ఎన్హెచ్ఏఐ కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇకపై విండ్స్క్రీన్పై ఫాస్టాగ్ స్టికర్ ఏర్పాటు చేయకపోతే.. టోల్లైన్లోకి ప్రవేశించే వాహనదారుల నుంచి డబుల్ టోల్ వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విండ్స్క్రీన్పై ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్ట్యాగ్ను ఇన్స్టాల్ చేయకపోవడంతో టోల్ ప్లాజాల దగ్గర అనవసరమైన జాప్యాలు కొనసాగుతున్నాయని.. దాంతో ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.
Read Also: Pakistan : భయపడిన పాకిస్తాన్ షాబాజ్ ప్రభుత్వం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లపై నిషేధం
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
కాగా, ముందువైపు అద్దంపై ఫాస్టాగ్ స్టికర్ లేకపోతే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలు, రాయితీదారులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ పొడ్యూసర్ని జారీ చేసింది. దీంతో ఫాస్టాగ్లను అమర్చని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. విండ్షీల్డ్పై ఫాస్టాగ్ లేకుండా టోల్లేన్లోకి ప్రవేశిస్తే విధించే రుసుంలపై డబుల్ ఫీజులతో కూడిన బోర్డులు ప్రదర్శించాలని ఎన్హెచ్ఏఐ ఆదేశాలు ఇచ్చింది. ఫాస్టాగ్లు లేని వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ను సీసీటీవీ ఫుటేజీలో సైతం రికార్డు చేయాలని వెల్లడించింది. దీంతో వాహనాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించవచ్చని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.
అయితే, ఫాస్టాగ్లను ఏర్పాటు చేసుకోలేకపోతే లావాదేవీల నిర్వహణకు అర్హత ఉండదని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. అలాంటి వారు రెట్టింపు టోల్ రుసుమును చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అలా చేసే వారిని బ్లాక్లిస్ట్ చేర్చ వచ్చని ఎన్హెచ్ఏఐ తెలిపింది. వివిధ పాయింట్ల నుంచి జారీ చేసే సమయంలో వాహనం విండ్స్క్రీన్పై ఫాస్టాగ్ ఇన్స్టాల్ చేసినట్లుగా నిర్ధారించుకోవాలని ఆయా బ్యాంకులను సైతం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న వెయ్యి టోల్ ప్లాజాల దగ్గర సుమారు 45 వేల కిలో మీటర్ల జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలలో వాహనదారుల నుంచి టోల్ రూసుం వసూలు చేస్తున్నారు. దాదాపు 8 కోట్ల మంది నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. ఫాస్టాగ్ దేశంలో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!