Tamil Nadu: కంటతడి పెట్టిస్తున్న నవ వధువు చివరి సందేశం.. తండ్రితో బాధను పంచుకున్న కుమార్తె
- కంటతడి పెట్టిస్తున్న నవ వధువు చివరి సందేశం
- తండ్రితో బాధను పంచుకున్న కుమార్తె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో నవ వధువు రిధన్య అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి పంపించిన వాట్సాప్ రికార్డులు కంటతడి పెట్టిస్తున్నాయి. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాల్సిన చోట వేధింపులు మొదలయ్యాయి. అటు తల్లిదండ్రులను బాధపెట్టలేక.. ఇటు మనసు చంపుకోలేక తనకు తానుగా మరణశాసానాన్ని రాసుకుంది. చనిపోయే ముందు అల్లారు ముద్దుగా పెంచిన తండ్రికి చివరి సందేశాన్ని వాట్సాప్ ద్వారా రికార్డ్ చేసి పంపించింది. తాజాగా ఈ రికార్డ్ వాయిస్లు కంటతడి పెట్టిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Odisha: ఒడిశాలో దారుణం.. ఆఫీస్లోనే అధికారిని కొట్టిన బీజేపీ నేతలు
Also Read
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో గత ఏప్రిల్లో కవిన్ కుమార్ అనే యువకుడితో రిధన్య (27) వివాహం జరిగింది. పెళ్లి సమయంలో దాదాపు రూ.కోటి వరకు కట్న, కానుకలు ఇచ్చారు. ఇంకేముంది కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ వారం తర్వాత అత్తారింటి స్వరూపం బయటపడింది. నిత్యం భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. అంతేనా అంటే అంతకు మంచి టార్చర్ చేయడం ప్రారంభించారు. భర్త కవిన్కుమార్ శారీరికంగా హింసిస్తుంటే.. మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవి మానసికంగా హింసించడం మొదలు పెట్టారు. దీంతో రిధన్య కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా ఎంత కాలం బ్రతకాలంటూ తనకు తాను మరణశాసానాన్ని రాసుకుంది. తిరిగి పుట్టింటికి వెళ్లి రక్తసంబంధుకుల్ని బాధపెట్టకూడదని.. వాళ్లను మరింత వేదనకు గురి చేయకూడదని చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. పురుగుల మందు సేవించి ప్రాణాలు తీసుకుంది. అయితే చివరిగా తన తండ్రికి వాట్సాప్ ద్వారా తన గోడును వెళ్లబుచ్చుకుంది. అత్తారింట్లో అనుభవిస్తున్న నరకాన్ని పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Meenakshi Chaudhary : కూల్ వెదర్ లో మీనాక్షి చౌదరి హాట్ ఫొటోస్
‘‘నా భర్త, అతని కుటుంబ సభ్యులే నా మరణానికి కారణం. నేను రోజు శారీరకంగా.. మానసికంగా వేధింపులకు గురవుతున్నా. ఇక ఈ జీవితం నాకు వద్దు. వాళ్లు ఎప్పటికీ మారరు. అందుకే ఈ జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నా. దీనికి భర్త కవిన్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవే కారణం. నా వివాహం విఫలమైంది. దయచేసి నన్ను క్షమించండి. అమ్మా, నాన్న.’’ అంటూ రిధన్య ఆడియో సందేశంలో ఆవేదన తెలియజేసింది. బిడ్డ మాటలు విన్న పేరెంట్స్ ఆవేదన చెందారు. అత్తారింట్లో ఎంత నరకం అనుభవించి ఉంటుందని కన్నీరుమున్నీరు అయ్యారు.
రిధన్య కారులో ఆలయానికి వెళ్తుండగా మార్గమధ్యలో పురుగుల ముందు తాగి ప్రాణాలు తీసుకుంది. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసి రిధన్య వాట్సాప్ రికార్డుల ప్రకారం.. భర్త, అత్తామామలను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!