Tamil Nadu: కంటతడి పెట్టిస్తున్న నవ వధువు చివరి సందేశం.. తండ్రితో బాధను పంచుకున్న కుమార్తె
- కంటతడి పెట్టిస్తున్న నవ వధువు చివరి సందేశం
- తండ్రితో బాధను పంచుకున్న కుమార్తె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో నవ వధువు రిధన్య అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇక ఆత్మహత్యకు ముందు తన తండ్రికి పంపించిన వాట్సాప్ రికార్డులు కంటతడి పెట్టిస్తున్నాయి. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే.. సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాల్సిన చోట వేధింపులు మొదలయ్యాయి. అటు తల్లిదండ్రులను బాధపెట్టలేక.. ఇటు మనసు చంపుకోలేక తనకు తానుగా మరణశాసానాన్ని రాసుకుంది. చనిపోయే ముందు అల్లారు ముద్దుగా పెంచిన తండ్రికి చివరి సందేశాన్ని వాట్సాప్ ద్వారా రికార్డ్ చేసి పంపించింది. తాజాగా ఈ రికార్డ్ వాయిస్లు కంటతడి పెట్టిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Odisha: ఒడిశాలో దారుణం.. ఆఫీస్లోనే అధికారిని కొట్టిన బీజేపీ నేతలు
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో గత ఏప్రిల్లో కవిన్ కుమార్ అనే యువకుడితో రిధన్య (27) వివాహం జరిగింది. పెళ్లి సమయంలో దాదాపు రూ.కోటి వరకు కట్న, కానుకలు ఇచ్చారు. ఇంకేముంది కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ వారం తర్వాత అత్తారింటి స్వరూపం బయటపడింది. నిత్యం భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. అంతేనా అంటే అంతకు మంచి టార్చర్ చేయడం ప్రారంభించారు. భర్త కవిన్కుమార్ శారీరికంగా హింసిస్తుంటే.. మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవి మానసికంగా హింసించడం మొదలు పెట్టారు. దీంతో రిధన్య కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా ఎంత కాలం బ్రతకాలంటూ తనకు తాను మరణశాసానాన్ని రాసుకుంది. తిరిగి పుట్టింటికి వెళ్లి రక్తసంబంధుకుల్ని బాధపెట్టకూడదని.. వాళ్లను మరింత వేదనకు గురి చేయకూడదని చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. పురుగుల మందు సేవించి ప్రాణాలు తీసుకుంది. అయితే చివరిగా తన తండ్రికి వాట్సాప్ ద్వారా తన గోడును వెళ్లబుచ్చుకుంది. అత్తారింట్లో అనుభవిస్తున్న నరకాన్ని పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Meenakshi Chaudhary : కూల్ వెదర్ లో మీనాక్షి చౌదరి హాట్ ఫొటోస్
‘‘నా భర్త, అతని కుటుంబ సభ్యులే నా మరణానికి కారణం. నేను రోజు శారీరకంగా.. మానసికంగా వేధింపులకు గురవుతున్నా. ఇక ఈ జీవితం నాకు వద్దు. వాళ్లు ఎప్పటికీ మారరు. అందుకే ఈ జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నా. దీనికి భర్త కవిన్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవే కారణం. నా వివాహం విఫలమైంది. దయచేసి నన్ను క్షమించండి. అమ్మా, నాన్న.’’ అంటూ రిధన్య ఆడియో సందేశంలో ఆవేదన తెలియజేసింది. బిడ్డ మాటలు విన్న పేరెంట్స్ ఆవేదన చెందారు. అత్తారింట్లో ఎంత నరకం అనుభవించి ఉంటుందని కన్నీరుమున్నీరు అయ్యారు.
రిధన్య కారులో ఆలయానికి వెళ్తుండగా మార్గమధ్యలో పురుగుల ముందు తాగి ప్రాణాలు తీసుకుంది. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసి రిధన్య వాట్సాప్ రికార్డుల ప్రకారం.. భర్త, అత్తామామలను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
-
Sambarala Yeti Gattu: క్లైమాక్స్కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్తో భారీ అప్డేట్!
-
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!