Tamil Nadu: వేధింపులు భరించలేకపోతున్నా.. తండ్రికి మెసేజ్ పెట్టి తనువు చాలించిన నవ వధువు
- తమిళనాడులో ఘోరం
- వేధింపులు భరించలేకపోతున్నాను
- తండ్రికి మెసేజ్ పెట్టి తనువు చాలించిన నవ వధువు
వరకట్న పిశాచికి మరో అబల బలైపోయింది. కూతురు జీవితం సుఖంగా ఉండాలని భారీగా కట్న, కానుకలు ఇచ్చి ఎంతో గ్రాండ్గా వివాహం జరిపించాడు ఆ తండ్రి. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు. పెళ్లైన దగ్గర నుంచి భర్త, అత్తమామలు నిత్యం వరకట్న వేధింపులు చేస్తూనే ఉన్నారు. అటు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక.. ఇటు మనసు చంపుకుని బ్రతకలేక నవ వధువు తనువు చాలించింది. ఈ ఘోర విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: AP BJP Chief : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్న పీవీఎన్ మాధవ్..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
రిధన్య (27), వస్త్ర కంపెనీ యజమాని అన్నాదురై కుమార్తె. ఈ ఏడాది ఏప్రిల్లో కవిన్కుమార్(28) అనే యువకుడికిచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 800 గ్రాముల బంగారం, రూ.70లక్షల విలువైన వోల్వో కారు కట్నం కింద ఇచ్చారు. అంతేకాకుండా గ్రాండ్గా తిరుప్పూర్లో వివాహం జరిపించారు. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు. నిత్యం భర్త, అత్తమామలు వరకట్నం కోసం రిధన్యను వేధిస్తూనే ఉన్నారు.
ఇది కూడా చదవండి: Blast : పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు.. 5గురు మృతి
ఇక అత్తింటి వారి వేధింపులు భరించలేక రిధన్య కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆదివారం మొండిపాళయంలోని ఒక ఆలయానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. మార్గమధ్యలో కారు ఆపి పురుగుల మందు సేవించింది. చాలా సేపు కారు ఆగి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా రిధన్య నోటి నుంచి నురగ రావడం చూశారు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా ఆమె అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు.
ఇక చనిపోయే ముందు రిధన్య తన తండ్రికి వాట్సాప్ మెసేజ్లు పెట్టింది. ఏడు ఆడియో సందేశాలను పంపించింది. తన నిర్ణయానికి క్షమాపణలు చెబుతున్నా.. నిత్యం అత్త గారింట్లో వేధింపులు భరించలేకపోతున్నాను.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. రోజూ మానసిక హింసను భరించలేకపోతున్నానని.. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సందేశంలో పేర్కొంది. ‘‘నా జీవితాంతం మీకు భారంగా ఉండాలనుకోవడం లేదు. ఈసారి నేను ఏ తప్పు చేయలేదు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నన్ను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నేను ఈ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాను.’’ అని రిధన్య మెసేజ్లో స్పష్టం చేసింది.
రిధన్య మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వెలుపల ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె భర్త కవిన్ కుమార్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవిలను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!