Tamil Nadu: వేధింపులు భరించలేకపోతున్నా.. తండ్రికి మెసేజ్ పెట్టి తనువు చాలించిన నవ వధువు
- తమిళనాడులో ఘోరం
- వేధింపులు భరించలేకపోతున్నాను
- తండ్రికి మెసేజ్ పెట్టి తనువు చాలించిన నవ వధువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరకట్న పిశాచికి మరో అబల బలైపోయింది. కూతురు జీవితం సుఖంగా ఉండాలని భారీగా కట్న, కానుకలు ఇచ్చి ఎంతో గ్రాండ్గా వివాహం జరిపించాడు ఆ తండ్రి. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు. పెళ్లైన దగ్గర నుంచి భర్త, అత్తమామలు నిత్యం వరకట్న వేధింపులు చేస్తూనే ఉన్నారు. అటు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక.. ఇటు మనసు చంపుకుని బ్రతకలేక నవ వధువు తనువు చాలించింది. ఈ ఘోర విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: AP BJP Chief : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్న పీవీఎన్ మాధవ్..
Also Read
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
రిధన్య (27), వస్త్ర కంపెనీ యజమాని అన్నాదురై కుమార్తె. ఈ ఏడాది ఏప్రిల్లో కవిన్కుమార్(28) అనే యువకుడికిచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 800 గ్రాముల బంగారం, రూ.70లక్షల విలువైన వోల్వో కారు కట్నం కింద ఇచ్చారు. అంతేకాకుండా గ్రాండ్గా తిరుప్పూర్లో వివాహం జరిపించారు. అయినా కూడా అత్తింటి వారికి ధనదాహం తీరలేదు. నిత్యం భర్త, అత్తమామలు వరకట్నం కోసం రిధన్యను వేధిస్తూనే ఉన్నారు.
ఇది కూడా చదవండి: Blast : పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు.. 5గురు మృతి
ఇక అత్తింటి వారి వేధింపులు భరించలేక రిధన్య కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆదివారం మొండిపాళయంలోని ఒక ఆలయానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. మార్గమధ్యలో కారు ఆపి పురుగుల మందు సేవించింది. చాలా సేపు కారు ఆగి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా రిధన్య నోటి నుంచి నురగ రావడం చూశారు. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా ఆమె అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు.
ఇక చనిపోయే ముందు రిధన్య తన తండ్రికి వాట్సాప్ మెసేజ్లు పెట్టింది. ఏడు ఆడియో సందేశాలను పంపించింది. తన నిర్ణయానికి క్షమాపణలు చెబుతున్నా.. నిత్యం అత్త గారింట్లో వేధింపులు భరించలేకపోతున్నాను.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. రోజూ మానసిక హింసను భరించలేకపోతున్నానని.. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సందేశంలో పేర్కొంది. ‘‘నా జీవితాంతం మీకు భారంగా ఉండాలనుకోవడం లేదు. ఈసారి నేను ఏ తప్పు చేయలేదు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నన్ను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. నాకు ఈ జీవితం ఇష్టం లేదు. నేను ఈ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాను.’’ అని రిధన్య మెసేజ్లో స్పష్టం చేసింది.
రిధన్య మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వెలుపల ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె భర్త కవిన్ కుమార్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవిలను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
తాజావార్తలు
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!