Blast : పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు.. 5గురు మృతి
- పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు
- పాశమైలారంలోని సీగాచి కెమికిల్స్ పరిశ్రమలో పేలిన రియాక్టర్
- పేలుడు ధాటికి 100 మీటర్ల అవతలికి ఎగిరిపడ్డ కార్మికులు
- 20 మందికిపైగా కార్మికులకు తీవ్రగాయాలు.. పలువురు మృతి చెందినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blast : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. దీంతో కార్మికులు పనిలో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటం, పేలుడుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి.
పేలుడు ధాటికి పరిశ్రమ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. సుమారు 100 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు ఎగిరిపడ్డాయని ప్రత్యక్షదారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు కార్మికులు మృతి చెందగా, ఇంకా 20 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
Star Wars : ఆ ఇద్దరి స్టార్స్ మధ్య మరోసారి నువ్వా నేనా.?
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. తీవ్ర గాయాలపాలైనవారిని అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు.
పేలుడు సమయంలో పరిశ్రమలో ఉన్న పలువురు కార్మికులు బయటకు పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే పేలుడు శబ్దం దూరం వరకు వినిపించడంతో పరిసర ప్రాంతాల్లోని స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు, సహచర కార్మికులు చేరుతున్నారు.
ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా, గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలో ఇంకా మంటలు కొనసాగుతుండటంతో రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికి స్పష్టంగా తెలియకపోయినా, రియాక్టర్ లో ఏదైనా సాంకేతిక లోపం వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పరిశ్రమలో రక్షణ నిబంధనలు పాటించారా లేదా అన్న దానిపై అధికారుల దృష్టి వెళుతోంది.
Regina Cassandra : సొగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న రెజీనా కాసాండ్రా
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!