Blast : పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు.. 5గురు మృతి
- పటాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు
- పాశమైలారంలోని సీగాచి కెమికిల్స్ పరిశ్రమలో పేలిన రియాక్టర్
- పేలుడు ధాటికి 100 మీటర్ల అవతలికి ఎగిరిపడ్డ కార్మికులు
- 20 మందికిపైగా కార్మికులకు తీవ్రగాయాలు.. పలువురు మృతి చెందినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blast : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక సీగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. దీంతో కార్మికులు పనిలో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా మంటలు ఎగసిపడటం, పేలుడుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి.
పేలుడు ధాటికి పరిశ్రమ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి పడిపోయినట్టు స్థానికులు తెలిపారు. సుమారు 100 మీటర్ల దూరం వరకు శరీర భాగాలు ఎగిరిపడ్డాయని ప్రత్యక్షదారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు కార్మికులు మృతి చెందగా, ఇంకా 20 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
Star Wars : ఆ ఇద్దరి స్టార్స్ మధ్య మరోసారి నువ్వా నేనా.?
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. తీవ్ర గాయాలపాలైనవారిని అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు.
పేలుడు సమయంలో పరిశ్రమలో ఉన్న పలువురు కార్మికులు బయటకు పరుగులు తీస్తూ ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే పేలుడు శబ్దం దూరం వరకు వినిపించడంతో పరిసర ప్రాంతాల్లోని స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు, సహచర కార్మికులు చేరుతున్నారు.
ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా, గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలో ఇంకా మంటలు కొనసాగుతుండటంతో రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికి స్పష్టంగా తెలియకపోయినా, రియాక్టర్ లో ఏదైనా సాంకేతిక లోపం వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పరిశ్రమలో రక్షణ నిబంధనలు పాటించారా లేదా అన్న దానిపై అధికారుల దృష్టి వెళుతోంది.
Regina Cassandra : సొగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న రెజీనా కాసాండ్రా
తాజావార్తలు
-
Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
DSC Candidates: డీఎస్సీ నియామకాల్లో అన్యాయం.. జగన్కు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!