New Uniform: లక్షద్వీప్ స్కూల్స్ లో కొత్త యూనిఫాం.. నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Uniform: కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ స్కూల్స్ లో కొత్త యూనిఫాంను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకురానున్న కొత్త యూనిఫామ్ అక్కడ నివసించే ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంటున్న కాంగ్రెస్.. కొత్త యూనిఫామ్ తీసుకురావడంపై నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అమలు చేసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించింది. తరగతులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ముస్లింలు అధికంగా ఉండే ద్వీపసమూహంలోని ద్వీపవాసుల అంతర్గత సంస్కృతి మరియు జీవనశైలిని ధ్వంసం చేసేలా నూతన యూనిఫాం నిబందన ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బాలికలకు హిజాబ్లు లేదా స్కార్ఫ్లపై స్పష్టత ఇవ్వకుండా కొత్త డ్రెస్ కోడ్ ఆదేశాలు ఇచ్చారని లక్షద్వీప్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ హమ్దుల్లా సయీద్ ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరియు లక్షద్వీప్ పరిపాలన దీవుల సంస్కృతి మరియు ధర్మాలకు పూర్తి విరుద్ధమైన ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కొత్త యూనిఫాం కోడ్ను ప్రవేశపెడుతూ విద్యా శాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించేది లేదని సయీద్ స్పష్టం చేశారు.
Read also: Tetanus Shot : దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ అవసరమేనా? మీ కోసమే పూర్తి వివరాలు?
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
విద్యాశాఖ ఉత్తర్వులు లక్షద్వీప్ సంస్కృతిని, ప్రస్తుతం ఉన్న జీవనశైలిని నాశనం చేసే విధంగా ఉన్నాయని.. అటువంటి ఆదేశాలను మేము అనుమతించము. ఇటువంటి విధానాల వలన ప్రజాస్వామ్య వ్యవస్థలో అనవసర ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉంటుందని అన్నారు. ఉత్తర్వులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక ఆందోళనలను ప్రారంభిస్తుందని స్పష్టం చేసిన ఆయన, పాఠశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన తెలియజేయనున్నట్టు తెలిపారు. ద్వీపసమూహంలో మద్యం దుకాణాలను అనుమతించడానికి లక్షద్వీప్ పరిపాలన యొక్క చర్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలను చేపడుతుందని తెలిపారు. లక్షద్వీప్ ఎంపీ, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ కూడా మద్యం ముసాయిదా పాలసీకి, పాఠశాలల్లో కొత్త యూనిఫాం ఉత్తర్వులకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీవుల ప్రజలు, తల్లిదండ్రుల సంఘం, పాఠశాలల్లో హిజాబ్ నిషేధాన్ని విధించే పరిపాలన యొక్క చర్యను ప్రతిఘటించాలని ఫజల్ ఫేస్బుక్ పోస్ట్లో కోరారు. కొత్త మద్యం పాలసీ మరియు యూనిఫాం కోడ్ను విధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అన్నారు. ద్వీపవాసులు యుగయుగాలుగా అనుసరిస్తున్న ఆచారాలు, మత విశ్వాసాలు, ఆహారపు అలవాట్లు, డ్రెస్సింగ్ విధానాలను నిర్మూలించే విధంగా ఉత్తర్వులు ఉన్నాయని మండిపడ్డారు. “నిర్దేశించిన యూనిఫాం నమూనాలు కాకుండా ఇతర దుస్తులను ధరించడం పాఠశాల పిల్లలలో ఏకరూపత భావనను ప్రభావితం చేస్తుందని.. పాఠశాలల్లో క్రమశిక్షణ మరియు ఏకరీతి దుస్తుల కోడ్ను నిర్వహించడం ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాలల అధిపతుల బాధ్యత” అని విద్య శాఖ జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది.విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు మొదలైన వారితో సహా అన్ని వాటాదారుల నుండి కొత్త నమూనాను ప్రవేశపెట్టాలనే నిర్ణయం ప్రశంసలు పొందిందని మరియు ప్రస్తుత విద్యా సంవత్సరానికి కూడా అదే విధానాన్ని కొనసాగించాలని విద్యా శాఖ నిర్ణయించిందని పేర్కొంది.ప్రతి విద్యార్థి నిర్ణీత యూనిఫారంలో మాత్రమే పాఠశాలకు హాజరు కావాలని సర్క్యులర్లో విద్యాశాఖ పేర్కొంది. ఇది ఏకరూపత, ఐక్యత మరియు సోదర భావాన్ని నిర్ధారించడమే కాకుండా విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందిస్తుందని.. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన యూనిఫాం ప్యాట్రన్ను తమ పరిధిలోని అన్ని పాఠశాలల్లోని కచ్చితంగా పాటించాలని పాఠశాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను పాటించకపోతే తీవ్రంగా పరిగణించబడుతుందని సర్క్యులర్లో స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!