Lalu Prasad Yadav: బీజేపీ ముందు తల వంచేదే లేదు.. ఈడీ సోదాలపై లాలూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో వరసగా ఈడీ సోదాలను నిర్వహించింది. తన కుమార్తె, మనవరాలు, కోడలును వేధిస్తున్నారంటూ లాలూ బీజేపీపై మండిపడ్డారు. నిరాధారఐమన ఆరోపణ పేరుతో ప్రతీకారం తీర్చుకుంటున్నారని అన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజులను చూశామని, ఈ యుద్ధంలో కూడా పోరాడుతామని ఆయన అన్నారు. నా కూతుళ్లు, చిన్న మనవరాలు, గర్భిణీ అయిన కోడళ్లను నిరాధారమైన ప్రతీకార కేసుల్లో బీజేపీ, ఈడీ 15 గంటల పాటు విచారించిందని ఆయన ఆరోపించారు. మాతో రాజకీయ యుద్ధం చేయడానికి బీజేపీ ఇంత తక్కువ స్థాయికి దిగజారాలా..? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
READ ALSO: MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు 137 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా తాను సైద్ధాంతిక పోరాటం చేశానని.. ఇది కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. బీజేపీ ముందు తాను తలవంచేది లేదని, మీ రాజకీయాల ముందు నా కుటుంబం, పార్టీ నుంచి ఎవరూ తలవంచరని ఆయన అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలను సీబీఐ విచారించిన కొన్ని రోజుల తర్వాత ఈడీ సోదాలు నిర్వహించింది. లాలూ కుమార్తెలు రాగిణి యాదవ్, చందా యాదవ్, హేమా యాదవ్ కు సంబంధించి వారి కార్యాలయాల్లో తనిఖీ చేశారు. పాట్నా, ఫుల్వారీ షరీప్, ఢిల్లీ, రాంచీ, ముంబై లో సోదాలు నిర్వహించారు.
2004 నుండి 2009 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో లాలూ, అతని కుటుంబ సభ్యులు ఉద్యోగాల కోసం నిరుద్యోగులన నుంచి భూమిని తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు అనతి కుమార్తెలు మీసా భారతి,హేమ తదితరుల పేర్లను సీబీఐ నమోదు చేసింది. ఈ కేసులో లాలూ కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ను కూడా శనివారం సీబీఐ సమన్లు జారీ చేసింది. అయితే ఆయన ఈ విచారణకు హాజరుకాలేదు.
हमने आपातकाल का काला दौर भी देखा है। हमने वह लड़ाई भी लड़ी थी। आधारहीन प्रतिशोधात्मक मामलों में आज मेरी बेटियों, नन्हें-मुन्ने नातियों और गर्भवती पुत्रवधु को भाजपाई ED ने 15 घंटों से बैठा रखा है। क्या इतने निम्नस्तर पर उतर कर बीजेपी हमसे राजनीतिक लड़ाई लड़ेंगी?
— Lalu Prasad Yadav (@laluprasadrjd) March 10, 2023
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!