Nepal Protest: పాకిస్తాన్ నుంచి నేపాల్ వరకు.. భారత్ చుట్టూ అశాంతి..
- భారత్ తప్పా అన్ని చుట్టూ అన్ని దేశాల్లో హింస..
- తాజాగా నేపాల్లో ఆందోళనలు, ప్రధాని రాజీనామా..
- గతంలో శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా ఇదే పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Protest: గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.
నేపాల్:
నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతోంది. ఈ నిరసనలు హింసాత్మక అల్లర్లుగా మారాయి. ఆ దేశ సుప్రీంకోర్టు, పార్లమెంట్తో సహా అధ్యక్షుడు, ప్రధాని నివాసాలను చుట్టుముట్టి దాడులు చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 20 మంది ఆందోళనకారులు మరణించారు. చివరకు అల్లర్లతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది, దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
బంగ్లాదేశ్:
2024 బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనాను గద్దె దించేందుకు విద్యార్థులు పెద్ద ఆందోళన చేపట్టారు. ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుమట్టడంతో ఆమె భారతదేశానికి పారిపోయి రావాల్సి వచ్చింది. అయితే, ఈ అల్లర్లను పూర్తిగా మతోన్మాద శక్తులు ఆధీనంలోకి తీసుకున్నాయి. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత, హిందువులతో పాటు మైనారిటీలపై పెద్ద ఎత్తున హత్యలు, అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలను రాడికల్ ఇస్లామిస్టులు తగలబెట్టారు.
శ్రీలంక:
2022లో ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం వదిలి పారిపోయేలా చేసింది. నేపాల్ మాదిరిగానే ఈ దేశంలో కూడా యువత నేతృత్వంలో ఉద్యమాలు జరిగాయి. అధ్యక్షుడు ఇంట్లోకి ప్రవేశించిన ఆందోళనకారులు అందినకాడికి దోచుకెళ్లారు. ఇదే విధంగా నేపాల్, బంగ్లాదేశ్లో జరిగాయి.
పాకిస్తాన్:
పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం అనేది బయటకు కనిపిస్తుంది, అంతా ఆర్మీ రాజ్యమే నడుస్తుంది. అందరికి తెలిసిన సత్యం. అయితే, దీనిని మార్చాలని భావించిన ఇమ్రాన్ ఖాన్ను 2022లో అవిశ్వాస తీర్మానంతో గద్దె దించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి ఆర్మీ ఈ నిరసనల్ని అణిచివేస్తోంది.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!