Nepal Protest: పాకిస్తాన్ నుంచి నేపాల్ వరకు.. భారత్ చుట్టూ అశాంతి..
- భారత్ తప్పా అన్ని చుట్టూ అన్ని దేశాల్లో హింస..
- తాజాగా నేపాల్లో ఆందోళనలు, ప్రధాని రాజీనామా..
- గతంలో శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా ఇదే పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Protest: గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.
నేపాల్:
నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతోంది. ఈ నిరసనలు హింసాత్మక అల్లర్లుగా మారాయి. ఆ దేశ సుప్రీంకోర్టు, పార్లమెంట్తో సహా అధ్యక్షుడు, ప్రధాని నివాసాలను చుట్టుముట్టి దాడులు చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 20 మంది ఆందోళనకారులు మరణించారు. చివరకు అల్లర్లతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది, దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
బంగ్లాదేశ్:
2024 బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనాను గద్దె దించేందుకు విద్యార్థులు పెద్ద ఆందోళన చేపట్టారు. ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుమట్టడంతో ఆమె భారతదేశానికి పారిపోయి రావాల్సి వచ్చింది. అయితే, ఈ అల్లర్లను పూర్తిగా మతోన్మాద శక్తులు ఆధీనంలోకి తీసుకున్నాయి. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత, హిందువులతో పాటు మైనారిటీలపై పెద్ద ఎత్తున హత్యలు, అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలను రాడికల్ ఇస్లామిస్టులు తగలబెట్టారు.
శ్రీలంక:
2022లో ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం వదిలి పారిపోయేలా చేసింది. నేపాల్ మాదిరిగానే ఈ దేశంలో కూడా యువత నేతృత్వంలో ఉద్యమాలు జరిగాయి. అధ్యక్షుడు ఇంట్లోకి ప్రవేశించిన ఆందోళనకారులు అందినకాడికి దోచుకెళ్లారు. ఇదే విధంగా నేపాల్, బంగ్లాదేశ్లో జరిగాయి.
పాకిస్తాన్:
పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం అనేది బయటకు కనిపిస్తుంది, అంతా ఆర్మీ రాజ్యమే నడుస్తుంది. అందరికి తెలిసిన సత్యం. అయితే, దీనిని మార్చాలని భావించిన ఇమ్రాన్ ఖాన్ను 2022లో అవిశ్వాస తీర్మానంతో గద్దె దించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి ఆర్మీ ఈ నిరసనల్ని అణిచివేస్తోంది.
తాజావార్తలు
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?