Nepal Protest: పాకిస్తాన్ నుంచి నేపాల్ వరకు.. భారత్ చుట్టూ అశాంతి..
- భారత్ తప్పా అన్ని చుట్టూ అన్ని దేశాల్లో హింస..
- తాజాగా నేపాల్లో ఆందోళనలు, ప్రధాని రాజీనామా..
- గతంలో శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా ఇదే పరిస్థితి..
Nepal Protest: గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.
నేపాల్:
నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతోంది. ఈ నిరసనలు హింసాత్మక అల్లర్లుగా మారాయి. ఆ దేశ సుప్రీంకోర్టు, పార్లమెంట్తో సహా అధ్యక్షుడు, ప్రధాని నివాసాలను చుట్టుముట్టి దాడులు చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 20 మంది ఆందోళనకారులు మరణించారు. చివరకు అల్లర్లతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది, దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
Also Read
బంగ్లాదేశ్:
2024 బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనాను గద్దె దించేందుకు విద్యార్థులు పెద్ద ఆందోళన చేపట్టారు. ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుమట్టడంతో ఆమె భారతదేశానికి పారిపోయి రావాల్సి వచ్చింది. అయితే, ఈ అల్లర్లను పూర్తిగా మతోన్మాద శక్తులు ఆధీనంలోకి తీసుకున్నాయి. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత, హిందువులతో పాటు మైనారిటీలపై పెద్ద ఎత్తున హత్యలు, అత్యాచారాలు చోటు చేసుకున్నాయి. హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలను రాడికల్ ఇస్లామిస్టులు తగలబెట్టారు.
శ్రీలంక:
2022లో ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం వదిలి పారిపోయేలా చేసింది. నేపాల్ మాదిరిగానే ఈ దేశంలో కూడా యువత నేతృత్వంలో ఉద్యమాలు జరిగాయి. అధ్యక్షుడు ఇంట్లోకి ప్రవేశించిన ఆందోళనకారులు అందినకాడికి దోచుకెళ్లారు. ఇదే విధంగా నేపాల్, బంగ్లాదేశ్లో జరిగాయి.
పాకిస్తాన్:
పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం అనేది బయటకు కనిపిస్తుంది, అంతా ఆర్మీ రాజ్యమే నడుస్తుంది. అందరికి తెలిసిన సత్యం. అయితే, దీనిని మార్చాలని భావించిన ఇమ్రాన్ ఖాన్ను 2022లో అవిశ్వాస తీర్మానంతో గద్దె దించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి ఆర్మీ ఈ నిరసనల్ని అణిచివేస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!