NEET-UG 2024: నేడు నీట్పై సుప్రీంకోర్టులో విచారణ..
- నీట్- యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా గందరగోళం..
- నీట్ పరీక్షపై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..
- విచారించనున్న సీజేఐ డీవై చంద్రచూడ్ తో కూడిన త్రిసభ ధర్మాసనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET-UG 2024: నీట్- యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. దీంతో నీట్–యూజీ 2024 నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ ( సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ కాబోతుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నీట్కు సంబంధించి దాఖలైన 38 పిటిషన్లపై వాదనలను విననుంది. అయితే, పరీక్షను క్యాన్సిల్ చేయడం సరైన పద్దతి కాదని.. పేపర్ లీకేజీ భారీ ఎత్తున జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మే 5వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ విద్యార్థులు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక, పేపర్ లీకేజీ ఆరోపణలపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
అయితే, ఇప్పటికే నీట్ యూజీ- 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 38 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ క్రమంలో అన్ని పిటిషన్లను కలిపి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఇక, మరోవైపు ఈ పరీక్ష క్యాన్సిల్ చేయకూడదని ఇటివల పలువురు విద్యార్థులు గుజరాత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు మంచి మార్కులు వచ్చాయి.. ఎగ్జామ్ రద్దు చేస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే అనేక చోట్ల పరీక్ష రద్దు చేయొద్దని కోరుతూ నిరసన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 24 లక్షల మంది రాసిన ఈ ఎగ్జామ్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!