NEET-UG 2024: నేడు నీట్పై సుప్రీంకోర్టులో విచారణ..
- నీట్- యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా గందరగోళం..
- నీట్ పరీక్షపై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..
- విచారించనున్న సీజేఐ డీవై చంద్రచూడ్ తో కూడిన త్రిసభ ధర్మాసనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET-UG 2024: నీట్- యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. దీంతో నీట్–యూజీ 2024 నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ ( సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ కాబోతుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నీట్కు సంబంధించి దాఖలైన 38 పిటిషన్లపై వాదనలను విననుంది. అయితే, పరీక్షను క్యాన్సిల్ చేయడం సరైన పద్దతి కాదని.. పేపర్ లీకేజీ భారీ ఎత్తున జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మే 5వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ విద్యార్థులు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక, పేపర్ లీకేజీ ఆరోపణలపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
అయితే, ఇప్పటికే నీట్ యూజీ- 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 38 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ క్రమంలో అన్ని పిటిషన్లను కలిపి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఇక, మరోవైపు ఈ పరీక్ష క్యాన్సిల్ చేయకూడదని ఇటివల పలువురు విద్యార్థులు గుజరాత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు మంచి మార్కులు వచ్చాయి.. ఎగ్జామ్ రద్దు చేస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే అనేక చోట్ల పరీక్ష రద్దు చేయొద్దని కోరుతూ నిరసన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 24 లక్షల మంది రాసిన ఈ ఎగ్జామ్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!