Neet Exam: నీట్ పరీక్షకు సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యం అయినా అంతే ఇక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neet Exam: దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ కు సర్వం సన్నద్ధమైంది. ప్రతీ సంవత్సరం నీట్ ర్యాంకు ద్వారా మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీవీఎస్, ఏహెచ్ సీట్లతో పాటు ఎయిమ్స్, జిప్మర్ సీట్లను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 543 నగరాలు, పట్టణాలతో పాటు విదేశాల్లో 13 నగరాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహణ ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..తెలంగాణ నుంచి 60 వేల మంది ఉన్నారు. తెలంగాణలో హైదరాబాద్ సహా మరో 25 సెంటర్లలో పరీక్షను నిర్వహిస్తున్నారు.
ఈ సారి పరీక్ష సమయాన్ని మరో 20 నిమిషాలు పెంచారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల 20 ప్రశ్నలు అధికంగా ఇచ్చినా.. పరీక్షా సమయాన్ని పెంచలేదు. ఈ సారి మాత్రం 200 నిమిషాల్లో 200 ప్రశ్నలకు గానూ 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 వరకు నీట్ పరీక్ష జరగనుంది. అయితే నిబంధనలు పాటించకున్నా.. నిమిషం ఆలస్యం అయినా.. పరీక్ష కేంద్రంలోపలికి అనుమతించమని ఎన్టీఏ ఇప్పటికే వెల్లడించింది. హిందీ, తెలుగులో పాటు 13 భాషల్లో పరీక్షను నిర్వహిస్తోంది.
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
Read Also: CM KCR Aerial Survey: మంపు ప్రాంతాల్లో సీఎం సర్వే.. పర్యటన షెడ్యూల్ ఇలా..
నిమిషం నిబంధనతో పాటు మాల్ ప్రాక్టీసింగ్ వంటి చర్యలకు పాల్పడితే మూడేళ్లు డిబార్ చేయనున్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లేముందు అడ్మిన్ కార్డుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రాన్ని తప్పని సరిగా తీసుకెళ్లాలి. కోవిడ్ నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఉంగరాలు, బ్రాస్ లెట్లు, చెవి పోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్లు, హెయిర్పిన్, హెయిర్బ్యాండ్, తాయత్తులు, పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, చేతి గడియారాలు, పెన్ను, పెన్సిల్, రబ్బరు, కాగితాలు, ఎలక్ట్రానిక్ పరికరాలకు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దని ఎన్టీఏ స్పష్టం చేసింది.
మంచినీళ్ల బాటిల్, ఆహార పదార్థాలను అనుమతించరు. అయితే అనారోగ్యంగా ఉన్నట్లు ఆధారాలు సమర్పిస్తే మందులు, నీళ్లబాటిల్ ను అనుమతిస్తారు. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నును ఎగ్జామ్ సెంటర్ లోనే ఇస్తారు. ఒక్కసారి పరీక్ష కోసం సెంటర్ లోపలికి వెళితే పరీక్ష పూర్తయ్యే వరకు బయటకు అనుమతించరు. నెగిటివ్ మార్కులు ఉండటంతో అభ్యర్థులు ఖచ్చితమైన సమధానాలు మాత్రమే ఇవ్వాలి. ఒక వేళ ఎగ్జామ్ లో సమానమైన మార్కులు వస్తే నెగిటివ్ మార్కులు తక్కువగా ఉన్న వారికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలని ఇప్పటికే ఎన్టీఏ నిర్ణయించింది.
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!