Voter roll revision: అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా సవరణ..
- దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా సవరణకు ఈసీ సన్నాహాలు..
- ఇప్పటికే బీహార్లో ఎస్ఐఆర్ పేరుతో సవరణలు..
- అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Voter roll revision: అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ ప్రారంభం కానున్నట్లు ఎలక్షన్ కమీషన్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశంలో దీనిపై చర్చించారు, ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలు ముగిసే లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రకటన రావచ్చు. కాన్ఫనెన్స్ కమ్ వర్క్ షాప్ సందర్భంగా ఓటర్ జాబితా సవరణకు ఎంత త్వరగా సిద్ధంగా ఉండొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అడిగినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికి ప్రాథమిక పనులు పూర్తవుతాయని, అక్టోబర్ లో ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతుందని చాలా మంది అధికారులు కమిషన్కు హామీ ఇచ్చారని తెలుస్తోంది.
Also Read
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
- CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
- Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ జాబితా సవరణను నిర్వహించింది. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సవరణ ప్రధాన లక్ష్యం మరణించిన వారి పేర్లు, వేరే ప్రాంతానికి మారిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం, అక్రమ ఓటర్లను ఏరిపారేయడం.
ఇటీవల బీహార్ రాష్ట్రంలో కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలు చేయడం సంచలనంగా మారింది. అక్రమ ఓటర్ల గుర్తించి, ఎన్నికల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తోంది. అయితే, ఈ ప్రక్రియను ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎన్నికల కమిషన్పై విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ-ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎస్ఐఆర్ని సవాల్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, కొన్ని సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ చర్య వల్ల చాలా మంది పౌరులు తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేరని ప్రతిపక్షాలు సుప్రీంని ఆశ్రయించాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే బీహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు దీనిని ‘‘రాజ్యాంగ ఆదేశం’’గా పేర్కొంది. రాజ్యాంగ సంస్థ పనితీరులో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఇటీవల బీహార్లో ఈ ప్రక్రియ ద్వారా 65 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసేశారు.
తాజావార్తలు
-
Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
-
Priyanka Mohan: గ్లోబల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రియాంక మోహన్!
-
PM SVANidhi Scheme: ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు రుణం..! షూరిటీ కూడా అవసరం లేదు
-
Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
-
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!