Nashik TCS Case: నిదా ఖాన్కు షాక్.. కోర్టులో కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik TCS Case: మహారాష్ట్రలో సంచలనం రేపుతున్న నాసిక్ టీసీఎస్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాసిక్ సెషన్స్ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేస్తూ, అన్ని పక్షాలు తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) నాసిక్ కార్యాలయానికి సంబంధించిన లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణల కేసులో నిదా ఖాన్ పేరు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించగా, తక్షణ ఉపశమనం కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
Read Also: New Airport: ఏపీ ప్రజలకు శుభవార్త.. 5000 ఎకరాల్లో అతి పెద్ద ఎయిర్ పోర్ట్..
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా ప్రభుత్వం, దర్యాప్తు అధికారి తమ వాదనలు వినిపించారు. బాధితురాలి తరఫు న్యాయవాది కూడా తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు సమయం కోరగా, కోర్టు ఆ అభ్యర్థనను ఆమోదించింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాతే మధ్యంతర బెయిల్పై నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, కంపెనీ కూడా నిదా ఖాన్పై కఠిన చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 9, 2026 తేదీతో జారీ చేసిన ఉత్తర్వుల్లో, ఆమెను తక్షణమే సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. నిదా ఖాన్ డిసెంబర్ 27, 2021 నుంచి ప్రాసెస్ అసోసియేట్గా పనిచేస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ ఆమెకు ఉన్న నెట్వర్క్ యాక్సెస్ను రద్దు చేయడంతో పాటు, కంపెనీకి చెందిన ఆస్తులను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కార్యాలయానికి రావడం, ఇంటి నుంచి పనిచేయడం రెండింటినీ నిషేధించింది. కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఇతర ఉద్యోగులతో పంచుకుంటే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఇక, ప్రస్తుతం నిదా ఖాన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆమె కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత, ఆమె ఆచూకీపై కొన్ని కీలక వివరాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా Maharashtra State Commission for Women ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వరుసగా మూడో రోజు కూడా విచారణ కొనసాగిస్తోంది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ముఠా పనిచేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక పురుష ఉద్యోగి ఫిర్యాదుతో సహా మొత్తం తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సమాచారం. మొత్తానికి, నిదా ఖాన్కు కోర్టులో ఉపశమనం లభించకపోవడం, కంపెనీ సస్పెన్షన్ చర్యలు, పోలీసుల గాలింపు కలిపి ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఏప్రిల్ 27న జరిగే తదుపరి విచారణపై అందరి దృష్టి నెలకొంది.
తాజావార్తలు
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!