Nashik TCS Case: నిదా ఖాన్కు షాక్.. కోర్టులో కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik TCS Case: మహారాష్ట్రలో సంచలనం రేపుతున్న నాసిక్ టీసీఎస్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాసిక్ సెషన్స్ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేస్తూ, అన్ని పక్షాలు తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) నాసిక్ కార్యాలయానికి సంబంధించిన లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణల కేసులో నిదా ఖాన్ పేరు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించగా, తక్షణ ఉపశమనం కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
Read Also: New Airport: ఏపీ ప్రజలకు శుభవార్త.. 5000 ఎకరాల్లో అతి పెద్ద ఎయిర్ పోర్ట్..
Also Read
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
విచారణ సందర్భంగా ప్రభుత్వం, దర్యాప్తు అధికారి తమ వాదనలు వినిపించారు. బాధితురాలి తరఫు న్యాయవాది కూడా తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు సమయం కోరగా, కోర్టు ఆ అభ్యర్థనను ఆమోదించింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాతే మధ్యంతర బెయిల్పై నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, కంపెనీ కూడా నిదా ఖాన్పై కఠిన చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 9, 2026 తేదీతో జారీ చేసిన ఉత్తర్వుల్లో, ఆమెను తక్షణమే సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. నిదా ఖాన్ డిసెంబర్ 27, 2021 నుంచి ప్రాసెస్ అసోసియేట్గా పనిచేస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ ఆమెకు ఉన్న నెట్వర్క్ యాక్సెస్ను రద్దు చేయడంతో పాటు, కంపెనీకి చెందిన ఆస్తులను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కార్యాలయానికి రావడం, ఇంటి నుంచి పనిచేయడం రెండింటినీ నిషేధించింది. కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఇతర ఉద్యోగులతో పంచుకుంటే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఇక, ప్రస్తుతం నిదా ఖాన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆమె కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత, ఆమె ఆచూకీపై కొన్ని కీలక వివరాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా Maharashtra State Commission for Women ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వరుసగా మూడో రోజు కూడా విచారణ కొనసాగిస్తోంది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ముఠా పనిచేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక పురుష ఉద్యోగి ఫిర్యాదుతో సహా మొత్తం తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సమాచారం. మొత్తానికి, నిదా ఖాన్కు కోర్టులో ఉపశమనం లభించకపోవడం, కంపెనీ సస్పెన్షన్ చర్యలు, పోలీసుల గాలింపు కలిపి ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఏప్రిల్ 27న జరిగే తదుపరి విచారణపై అందరి దృష్టి నెలకొంది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!