Nashik TCS Case: నిదా ఖాన్కు షాక్.. కోర్టులో కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik TCS Case: మహారాష్ట్రలో సంచలనం రేపుతున్న నాసిక్ టీసీఎస్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాసిక్ సెషన్స్ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేస్తూ, అన్ని పక్షాలు తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) నాసిక్ కార్యాలయానికి సంబంధించిన లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణల కేసులో నిదా ఖాన్ పేరు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించగా, తక్షణ ఉపశమనం కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
Read Also: New Airport: ఏపీ ప్రజలకు శుభవార్త.. 5000 ఎకరాల్లో అతి పెద్ద ఎయిర్ పోర్ట్..
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
విచారణ సందర్భంగా ప్రభుత్వం, దర్యాప్తు అధికారి తమ వాదనలు వినిపించారు. బాధితురాలి తరఫు న్యాయవాది కూడా తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు సమయం కోరగా, కోర్టు ఆ అభ్యర్థనను ఆమోదించింది. అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాతే మధ్యంతర బెయిల్పై నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, కంపెనీ కూడా నిదా ఖాన్పై కఠిన చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 9, 2026 తేదీతో జారీ చేసిన ఉత్తర్వుల్లో, ఆమెను తక్షణమే సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. నిదా ఖాన్ డిసెంబర్ 27, 2021 నుంచి ప్రాసెస్ అసోసియేట్గా పనిచేస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ ఆమెకు ఉన్న నెట్వర్క్ యాక్సెస్ను రద్దు చేయడంతో పాటు, కంపెనీకి చెందిన ఆస్తులను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కార్యాలయానికి రావడం, ఇంటి నుంచి పనిచేయడం రెండింటినీ నిషేధించింది. కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఇతర ఉద్యోగులతో పంచుకుంటే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఇక, ప్రస్తుతం నిదా ఖాన్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆమె కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత, ఆమె ఆచూకీపై కొన్ని కీలక వివరాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా Maharashtra State Commission for Women ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వరుసగా మూడో రోజు కూడా విచారణ కొనసాగిస్తోంది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ముఠా పనిచేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక పురుష ఉద్యోగి ఫిర్యాదుతో సహా మొత్తం తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సమాచారం. మొత్తానికి, నిదా ఖాన్కు కోర్టులో ఉపశమనం లభించకపోవడం, కంపెనీ సస్పెన్షన్ చర్యలు, పోలీసుల గాలింపు కలిపి ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఏప్రిల్ 27న జరిగే తదుపరి విచారణపై అందరి దృష్టి నెలకొంది.
తాజావార్తలు
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?