New Airport: ఏపీ ప్రజలకు శుభవార్త.. 5000 ఎకరాల్లో అతి పెద్ద ఎయిర్ పోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభివృద్ధి, దూరదృష్టిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో అమరావతిని రోల్ మోడల్గా చూపిస్తూ.. పారిశ్రామిక హబ్ అయిన కోయంబత్తూరు అభివృద్ధిపై తనదైన విశ్లేషణ చేశారు. చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో అమరావతి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రాజధాని నగరాన్ని పరిపాలనా కేంద్రంగానే కాకుండా, ప్రపంచ స్థాయి ఆర్థిక హబ్గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే 5000 ఎకరాల విస్తీర్ణంలో భారీ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి పునాది వేశామని గుర్తుచేశారు. “హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇప్పటికే 2500 ఎకరాల్లో పెద్ద ఎయిర్పోర్టులు ఉన్నా, ప్రస్తుత రద్దీ దృష్ట్యా ఆ నగరాలు రెండో ఎయిర్పోర్ట్ గురించి ఆలోచిస్తున్నాయి. కానీ మనం 30 ఏళ్ల తర్వాత పెరగబోయే విమాన ప్రయాణీకుల రద్దీని ఇప్పుడే అంచనా వేసి అడుగులు వేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
Also Read
- Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
- Rocket Explosion: బ్లూ ఆరిజిన్కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
- AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
- Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
Also Read:Stock Market: స్టాక్ మార్కెట్లో రక్త కన్నీరు.. ఒక్క రోజులో రూ.71 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!
తమిళనాడులోని ప్రముఖ పారిశ్రామిక నగరం కోయంబత్తూరులో విమానాశ్రయ విస్తరణ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కేవలం 500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంటే సరిపోతుందని భావించడం పాలకుల దూరదృష్టి లోపానికి నిదర్శనమని విమర్శించారు. దక్షిణ భారతదేశంలో మాంచెస్టర్గా పేరుగాంచిన కోయంబత్తూరు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలంటే మెగా ఎయిర్పోర్ట్ అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
భూసేకరణ విషయంలో వెనకడుగు వేయడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు కుంచించుకుపోతుందని, చిన్న విమానాశ్రయాలతో సర్దుకుపోవడం వల్ల భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండదని హెచ్చరించారు. అమరావతిలో రైతులు స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములైన తీరును ఆయన ఉదహరించారు. సరైన నాయకత్వం ఉంటేనే కోయంబత్తూరు వంటి నగరాలు ప్రపంచ పటంలో నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
-
Peddi : బెజవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. సెలబ్రేషన్స్ పీక్స్
-
Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
-
Vaibhav Sooryavanshi: “రెండు సెంచరీలు మిస్.. ఫీల్ అవుతున్నావా?”.. క్వాలిఫయర్ 2కు ముందు వైభవ్ ఆసక్తికర సమాధానం..
-
Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!