New Airport: ఏపీ ప్రజలకు శుభవార్త.. 5000 ఎకరాల్లో అతి పెద్ద ఎయిర్ పోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభివృద్ధి, దూరదృష్టిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో అమరావతిని రోల్ మోడల్గా చూపిస్తూ.. పారిశ్రామిక హబ్ అయిన కోయంబత్తూరు అభివృద్ధిపై తనదైన విశ్లేషణ చేశారు. చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో అమరావతి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రాజధాని నగరాన్ని పరిపాలనా కేంద్రంగానే కాకుండా, ప్రపంచ స్థాయి ఆర్థిక హబ్గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే 5000 ఎకరాల విస్తీర్ణంలో భారీ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి పునాది వేశామని గుర్తుచేశారు. “హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇప్పటికే 2500 ఎకరాల్లో పెద్ద ఎయిర్పోర్టులు ఉన్నా, ప్రస్తుత రద్దీ దృష్ట్యా ఆ నగరాలు రెండో ఎయిర్పోర్ట్ గురించి ఆలోచిస్తున్నాయి. కానీ మనం 30 ఏళ్ల తర్వాత పెరగబోయే విమాన ప్రయాణీకుల రద్దీని ఇప్పుడే అంచనా వేసి అడుగులు వేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
Also Read
- Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
- Venkaiah Naidu: యోగాను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం..
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్చేస్తే..
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
Also Read:Stock Market: స్టాక్ మార్కెట్లో రక్త కన్నీరు.. ఒక్క రోజులో రూ.71 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!
తమిళనాడులోని ప్రముఖ పారిశ్రామిక నగరం కోయంబత్తూరులో విమానాశ్రయ విస్తరణ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కేవలం 500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంటే సరిపోతుందని భావించడం పాలకుల దూరదృష్టి లోపానికి నిదర్శనమని విమర్శించారు. దక్షిణ భారతదేశంలో మాంచెస్టర్గా పేరుగాంచిన కోయంబత్తూరు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలంటే మెగా ఎయిర్పోర్ట్ అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
భూసేకరణ విషయంలో వెనకడుగు వేయడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు కుంచించుకుపోతుందని, చిన్న విమానాశ్రయాలతో సర్దుకుపోవడం వల్ల భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండదని హెచ్చరించారు. అమరావతిలో రైతులు స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములైన తీరును ఆయన ఉదహరించారు. సరైన నాయకత్వం ఉంటేనే కోయంబత్తూరు వంటి నగరాలు ప్రపంచ పటంలో నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Dhanush: మృణాల్ ఠాకూర్ ప్రేమకు బ్రేక్? డేటింగ్ రూమర్స్ తర్వాత కొత్త ట్విస్ట్ ఇదేనా!
-
iQOO Z11i: iQOO Z11i త్వరలో లాంచ్.. Snapdragon 4 Gen 2 చిప్సెట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
-
Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
-
Toxic Update : ‘టాక్సిక్’ మళ్లీ ట్రాక్లోకి.. యష్ ఫ్యాన్స్ కోసం వచ్చే వారం సాలిడ్ సర్ప్రైజ్?
-
Venkaiah Naidu: యోగాను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం..
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!