Rajiv Gandhi Assassination: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నళిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajiv Gandhi Assassination: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో దోషిగా ఉన్న ఏజీ పెరారివాలన్ను అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు మే నెలలో విడుదల చేయగా.. దీనిని ఉదహిరిస్తూ నళిని సుప్రీం కోర్డు మెట్లెక్కారు. ఈ మేరుకు మే 18న పెరారివాలన్ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ కేసు నుంచి కాస్త ఉపశమనం పొందాడు.
దీంతో ఈ కేసులో దోషులుగా ఉన్న నళిని, రవిచంద్రన్ కూడా తమకు ఉపశమనం కలిగించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పైగా నళిని 31 ఏళ్లు పైగా జైలు జీవితాన్ని అనుభవించానని కాబట్లి ఇక తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ పిటిషన్ పెట్టుకున్నారు. ఐతే 2015 నుంచి తమిళనాడు గవర్నర్ వద్దే పెండింగ్లో ఉంది. నళిని తనను విడుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చిందని ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. దీంతో తాము దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
Arvind Kejriwal: ధనవంతులకు రుణమాఫీలు, పేదవాడిపై పన్నుల భారం.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు
హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురిలో ఒకరైన ఏజీ పేరారివాలన్ను విడుదల చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం మే 18న సుప్రీం కోర్టు తన అసాధారణ అధికారాలను కల్పించింది. పెరారివాలన్ విడుదలైన తర్వాత, రవిచంద్రన్, అతనితో సహా మిగిలిన ఆరుగురు దోషులను విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్కు లేఖ పంపారు. గవర్నర్ విడుదల ఫైళ్లను మూడేళ్లుగా పరిగణనలోకి తీసుకోకుండా ఉంచారని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తాను ఖండిస్తున్నానని పేర్కొన్నాడు. సెప్టెంబరు 2018లో తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసు ఆధారంగా జైలు నుండి ముందస్తు విడుదల కోసం పెరారివాలన్ చేసిన అభ్యర్థనను నిర్ణయిస్తూ, అత్యున్నత న్యాయస్థానం అతనిని విడుదల చేయాలని ఆదేశించింది, మరో ఆరుగురు దోషులు జైలులోనే ఉన్నారు. హైకోర్టు ఆదేశంపై రవిచంద్రన్ తన అప్పీల్లో పెరారివాలన్ సుప్రీం కోర్టు ఆదేశాలను ఉదహరించారు. మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళా మానవబాంబుగా మారడంతో రాజీవ్ గాంధీ హత్య గావించబడ్డారు.
తాజావార్తలు
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!