Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- ప్రియురాలి కోసం బరితెగించిన మైనర్
- ఐఫోన్ కొనేందుకు భారీ దోపిడీ
- పోలీసులకు అడ్డంగా దొరికిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలిసీతెలియని వయసులో కొందరు పిల్లలు ఏం చేస్తున్నారో అంతు చిక్కడం లేదు. వ్యామోహమో.. లేదంటే బడాయి కోసమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. మీసాలు కూడా రాని వయసులోనే ప్రేమలో పడుతున్నారు. అంతటితో ఆగుతున్నారంటే అది లేదు. ప్రేయసిని మెప్పించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది.
ఓ మైనర్కు ప్రియురాలు ఉంది. ఐఫోన్ బహుమతి ఇవ్వాలని ఆమె కోరింది. అంతే తడువుగా చేతిలో చిల్లుగవ్వ లేకపోయినా కొనిస్తానని మాటిచ్చాడు. అయితే ప్రేయసికి ఎలాగైనా ఐఫోన్ కొనాలని పూనుకున్నాడు. బుర్రకు పదునుపెట్టి భారీ దోపిడీకి స్కెచ్ గీశాడు. దీనికి తన స్నేహితుల సాయం కోరాడు. అంతే తడువుగా ఓ గిడ్డంగిలో రూ.12 లక్షల విలువైన సామాగ్రి దొంగిలించారు. పాపం పండి అడ్డంగా దొరికిపోయారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
నాగ్పూర్లోని లకడ్గంజ్ ప్రాంతానికి చెందిన రాహుల్ జైచంద్కు కల్మానా ప్రాంతంలో ‘రాహుల్ సిరామిక్స్ ప్రైవేటు లిమిటెడ్’’ పేరుతో టైల్, శానిటరీ వేర్, సిపి ఫిట్టింగ్స్ గిడ్డంగి ఉంది. అయితే మే 27-28 తేదీల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు పైకప్పు రేకుల షీట్లను తొలగించి రూ.12 లక్షల విలువైన అత్యంత ఖరీదైన శానిటరీ ఉత్పత్తులను దొంగలించారు. దీంతో రాహుల్ జైచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీరియస్గా తీసుకున్న కలమ్నా పోలీసుల దర్యాప్తు బృందం.. సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. మొత్తానికి మైనర్ దొంగలను పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే దొంగతనాన్ని ఛేదించారు.
పోలీసులు షాక్
ఈ కేసులో ప్రధాన అనుమానితుడితో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను క్షుణ్ణంగా విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. దొంగతనానికి చెప్పిన కారణం తెలుసుకుని పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రేయసికి ఖరీదైన ఐఫోన్ కొనివ్వాలనుకున్నామని, అందుకు తమకు డబ్బు అత్యవసరమని ఒప్పుకున్నారు. ఆ కోరికతోనే గిడ్డంగిని లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దొంగిలించిన విలాసవంతమైన డిజైనర్ కుళాయిలను ఒక వీధి వ్యాపారికి కేవలం 20,000 రూపాయలకే అమ్మినట్లు మైనర్లు చెప్పారు. వస్తువులను కొనుగోలు చేసిన ప్రధాన నిందితుడు.. 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీ అలియాస్ ఇమ్ము రంజాన్ అలీని పోలీసులు అరెస్టు చేయగా.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుల నుంచి రూ. 6.5 లక్షల విలువైన విలాసవంతమైన డిజైనర్ ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..