భర్తపై కోర్టుకెక్కిన మహిళ.. ఆడవారిలా రెడీ అవుతున్నాడు, ఆ పని చేయడంలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన భర్త తరచూ ఆడవారిలా రెడీ అవుతున్నాడని, లిప్స్టిక్ పూసుకుంటున్నాడని, పెళ్లై రెండేళ్లయినా ఒకసారి కూడా లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. తన భర్తపై పలు ఆరోపణలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త.. ఆడవారిలా తరచూ రెడీ అవుతున్నాడని, పెళ్లై రెండేళ్లు అయినా లైంగిక సంబంధం పెట్టుకోవట్లేదని ఫిర్యాదు చేసింది. అందుకు తగ్గ ఆధారాలను కూడా ఆమె కోర్టుకు సమర్పించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు.. ఆమెకు నెలకు రూ.30 వేలు పరిహారం కింద చెల్లించాలని బాధితురాలి భర్తను ఆదేశించింది.
ఇండోర్లోని మహాలక్ష్మినగర్కు చెందిన 26 ఏళ్ల మహిళ.. అదే ప్రాంతంలో ఉంటున్న 32 ఏళ్ల దిలేశ్వర్ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయిన కొద్దిరోజులకే ఆమెను తన భర్తతోపాటు అత్త వేధించడం ప్రారంభించారు. ఆ తర్వాత బాధితురాలిని తీసుకుని దిలేశ్వర్.. పుణెలో కాపురం పెట్టాడు. కొద్దిరోజులకే బాధితురాలి అత్త అక్కడికి కూడా వచ్చింది. బాధితురాలిని తీవ్రంగా వేధించి ఇరువురూ ఇబ్బంది పెట్టారు. ఇక, ఆమె ఎదురుతిరగడం వల్ల కన్నవారింటికి పంపించేశాడు భర్త. ఎన్ని రోజులైనా తీసుకువెళ్లడానికి రాకపోవడం వల్ల ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హైకోర్టులోనూ పిటిషన్ వేసింది. అప్పుడు ఆ ఫిర్యాదులో తన భర్త వింత చేష్టలను పేర్కొంది.
Also Read
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
తన భర్త చేసే వింత చేష్టలను.. పిటిషన్లో తెలియజేసింది. పెళ్లైన తర్వాత ఒక్కసారి కూడా తనతో లైంగికంగా సంబంధం పెట్టుకోలేదని తెలిపింది. తాను ప్రయత్నించినా వేరే గదిలో పడుకునేవాడిని చెప్పింది. సాయంత్రం ఆడవారిలా మేకప్ వేసుకునేవాడని, చెవిపోగులు ధరించేవాడని పిటిషన్లో వెల్లడించింది . అలాగే పెదవులకు లిప్స్టిక్ పూసుకునేవాడని.. అలా చెయ్యొదని వారించినా చేయి చేసుకునేవాడిని ఆరోపించింది. ఆమె పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రతి నెలా రూ.30 వేలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!