Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Mva Unity In Question As Shiv Sena Ubt Decides To Go Solo In Mumbai Nagpur Municipal Elections

Maharashtra: ఎంవీఏ కూటమికి బీటలు.. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన(యూబీటీ) నిర్ణయం

Published Date :January 11, 2025 , 5:07 pm
By Suresh Maddala
  • మహా వికాస్ అఘాడీ కూటమికి బీటలు
  • మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఉద్ధవ్ థాక్రే పార్టీ నిర్ణయం
  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చీలికలు
Maharashtra: ఎంవీఏ కూటమికి బీటలు.. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన(యూబీటీ) నిర్ణయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండియా కూటమి దాదాపుగా చీలిపోయినట్లుగానే తెలుస్తోంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి పరిస్థితి మరింత దిగజారింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధానిలో ఆప్-కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నాయి. ఇటీవల బీహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే ఏర్పడిందని.. ఇప్పుడు దాని అవసరం లేదని.. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉండాలని సూచించారు. అలాగే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండియా కూటమి లోక్‌‌సభ ఎన్నికల కోసమేనని పేర్కొన్నారు.

తాజాగా మహారాష్ట్రలో అదే పరిస్థితి దాపురించింది. మహారాష్ట్రలో నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోరంగా వైఫల్యం చెందింది. దీంతో కూటమిలో చీలకలు మొదలయ్యాయి. లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఈ కూటమి మంచి ఫలితాలనే సాధించింది. 6 నెలలు తిరిగే సరికి అంతా రివర్స్ అయింది. అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. ప్రస్తుతం మహా వికాస్ అఘాడీ కూటమిలోని నేతల మధ్య పొసగడం లేదు. దీంతో కూటమి చీలిక దిశగా వెళ్తోంది.

Also Read

  • Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
  • Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
  • Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
  • Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!

ముంబై, నాగ్‌పూర్, థానేలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (యుూబీటీ) ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ శనివారం మీడియాకు వెల్లడించారు. దీంతో ఎంవీఏ ఐక్యతపై ప్రశ్నార్థకంగా మారింది. కూటమి కారణంగా పార్టీ కార్యకర్తలకు అవకాశాలు ఉండడం లేదని. సంస్థాగతంగా కూడా పరిస్థితులు బాగోలేదని.. అందుకే ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ముంబై, థానే, నాగ్‌పూర్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు, పంచాయతీ ఎన్నికల్లోనూ స్వతంత్రంగా పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సంకేతాలు ఇచ్చారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని.. ఓటమి తర్వాత కనీసం సమీక్ష చేసుకునేందుకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. దీంతో కూటమిలో నిరాశ, నిస్పృహలు ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ ఒంటరి అయింది. మిత్ర పక్షాలు సపోర్టు చేయలేదు. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కూడా కూటమి ఐక్యతగా లేదు. దీంతో దాదాపు కూటమి చీలిపోయినట్లుగానే వార్తలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మహాయుతి కూటమి 230 స్థానాలు గెలుచుకుంది. ఎంవీఏ కేవలం 46 స్థానాలతో సరిపెట్టుకుంది. శివసేన (యూబీటీ) 20,, కాంగ్రెస్ 20, ఎన్‌సీపీ (ఎస్‌పీ) 10 స్థానాలు గెలుచుకున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Decides
  • Maharashtra
  • mumbai
  • MVA unity question
  • Nagpur municipal elections

తాజావార్తలు

  • Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?

  • యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..

  • Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..

  • Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..

  • Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions