Maharashtra polls: ఇండియా కూటమికి షాక్.. చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా
- మహారాష్ట్రలో ఇండియా కూటమికి షాక్
- చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా
- కొల్హాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మధురిమా రాజే ఛత్రపతి ఉపసంహరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం నామినేషన్ పత్రాల ఉపసంహరణ చివరి నిమిషంలో విచిత్రమైన ట్విస్ట్ జరిగింది. ఉపసంహరణ గడువుకు కొద్ది క్షణాల ముందు కొల్హాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మధురిమా రాజే ఛత్రపతి షాకిచ్చింది. అనూహ్యంగా ఆమె కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
ఇది కూడా చదవండి: AP Assembly: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Also Read
- Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
- BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికారిక కాంగ్రెస్ అభ్యర్థిగా మధురిమా రాజే ఛత్రపతి నామినేషన్ వేశారు. వాస్తవానికి తొలుత ఈ స్థానం నుంచి మాజీ కార్పొరేటర్ రాజేష్ లట్కర్ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. అయితే 24 గంటల్లో కొల్హాపూర్ రాజ కుటుంబానికి చెందిన మధురిమా రాజే ఛత్రపతి పేరును భర్తీ చేశారు. దీంతో అసంతృప్తితో రాజేష్ లట్కర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే అతడు నామినేషన్ ఉపసంహరించుకునేలా కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. ఇంట్లోనూ కనిపించలేదు. మొబైల్కి అందుబాటులోకి రాలేదు. దీంతో చేసేదేమీలేక నామినేషన్ ఉపసంహరణకు 5-10 నిమిషాలే ఉండడంతో మధురిమా జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు.
ఇది కూడా చదవండి: Waqf Bill: ఇలా చేస్తే జేపీసీ నుంచి తప్పుకుంటాం.. లోక్సభ స్పీకర్కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపీలు..
ఎంపీ షాహూ ఛత్రపతి మాట్లాడుతూ.. నిస్సహాయతతోనే మధురిమా నామినేషన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. రాజేష్ లట్కర్ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో తామే వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. పార్టీకి ఇబ్బందులు తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొల్హాపూర్లో మహాయతి (శివసేన) అభ్యర్థిగా రాజేష్ క్షీరసాగర్.. స్వతంత్ర అభ్యర్థి రాజేష్ లట్కర్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Kadiyam Srihari : తప్పకుండ వర్గీకరణ జరుగుతుంది, కానీ మనం ఓపికగా ఉండాలి…
తాజావార్తలు
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
-
Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
-
Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!