Maharashtra polls: ఇండియా కూటమికి షాక్.. చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా
- మహారాష్ట్రలో ఇండియా కూటమికి షాక్
- చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా
- కొల్హాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మధురిమా రాజే ఛత్రపతి ఉపసంహరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం నామినేషన్ పత్రాల ఉపసంహరణ చివరి నిమిషంలో విచిత్రమైన ట్విస్ట్ జరిగింది. ఉపసంహరణ గడువుకు కొద్ది క్షణాల ముందు కొల్హాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మధురిమా రాజే ఛత్రపతి షాకిచ్చింది. అనూహ్యంగా ఆమె కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
ఇది కూడా చదవండి: AP Assembly: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికారిక కాంగ్రెస్ అభ్యర్థిగా మధురిమా రాజే ఛత్రపతి నామినేషన్ వేశారు. వాస్తవానికి తొలుత ఈ స్థానం నుంచి మాజీ కార్పొరేటర్ రాజేష్ లట్కర్ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. అయితే 24 గంటల్లో కొల్హాపూర్ రాజ కుటుంబానికి చెందిన మధురిమా రాజే ఛత్రపతి పేరును భర్తీ చేశారు. దీంతో అసంతృప్తితో రాజేష్ లట్కర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే అతడు నామినేషన్ ఉపసంహరించుకునేలా కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. ఇంట్లోనూ కనిపించలేదు. మొబైల్కి అందుబాటులోకి రాలేదు. దీంతో చేసేదేమీలేక నామినేషన్ ఉపసంహరణకు 5-10 నిమిషాలే ఉండడంతో మధురిమా జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు.
ఇది కూడా చదవండి: Waqf Bill: ఇలా చేస్తే జేపీసీ నుంచి తప్పుకుంటాం.. లోక్సభ స్పీకర్కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపీలు..
ఎంపీ షాహూ ఛత్రపతి మాట్లాడుతూ.. నిస్సహాయతతోనే మధురిమా నామినేషన్ ఉపసంహరించుకున్నారని తెలిపారు. రాజేష్ లట్కర్ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో తామే వెనక్కి తీసుకున్నట్లు చెప్పారు. పార్టీకి ఇబ్బందులు తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొల్హాపూర్లో మహాయతి (శివసేన) అభ్యర్థిగా రాజేష్ క్షీరసాగర్.. స్వతంత్ర అభ్యర్థి రాజేష్ లట్కర్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Kadiyam Srihari : తప్పకుండ వర్గీకరణ జరుగుతుంది, కానీ మనం ఓపికగా ఉండాలి…
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!