Pakistan: పాక్ అణ్వాయుధాలు అమెరికా చేతిలో ఉన్నాయా..? మాజీ-సీఐఏ అధికారి సంచలనం..
- ముషారఫ్ సమయంలో పాక్ అణ్వాయుధాలు అమెరికా చేతిలో..
- పాక్ అణు శాస్త్రవేత్త హత్యను సౌదీ అరేబియా అడ్డుకుంది..
- సంచలన విషయాలు వెల్లడించిన మాజీ సీఐఏ అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్గా, సీఐఏ అధికారిగా 15 ఏళ్ల పనిచేసిన జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మిలియన్ల కొద్ది అమెరికా సాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా నియంత్రించిందని పేర్కొన్నారు. ముషారఫ్ అణు నియంత్రణను అమెరికాకు అమ్మేశాడని ఆయన అన్నారు.
Read Also: India-Pakistan: యుద్ధం ఏదైనా భారత్ చేతిలో పాక్ ఓటమి తప్పదు: మాజీ అమెరికా అధికారి.
Also Read
- Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..!
- Pinarayi Vijayan: రగులుతున్న కేరళం.. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు! అధికారుల కార్లపై రాళ్ల దాడి..
- Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
- PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
అమెరికా విదేశాంగ విధానంపై కూడా కిరియాకౌ విమర్శలు గుప్పించింది. అమెరికా నియంతలతో సౌకర్యవంతంగా పనిచేస్తుందని, ప్రజస్వామ్య ఆదర్శాల కంటే స్వార్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. అమెరికా ఆర్థిక సాయంతో దీనిని కొనుగోలు చేసిందని చెప్పారు. ముషారఫ్ డబుల్ గేమ్ ఆడుతూ.. అమెరికాకు మద్దతు ఇస్తూనే, పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల్ని భారత్ పైకి ఎగదోశారని అన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. పాకిస్తాన్ సైన్యం అల్ఖైదాను పట్టించుకోలేదని, భారత్ గురించి పట్టించుకుందని చెప్పారు.
పాకిస్తాన్ అణు బాంబు రూపశిల్పి ఏక్యూ ఖాన్ను అమెరికా తలుచుకుంటే చంపేసేదని అన్నారు. ఇజ్రాయిల్ తరహాలో అమెరికా కూడా పాక్ అణు శాస్త్రవేత్తను హతమార్చేది కానీ, సౌదీ అరేబియా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో అమెరికా అతడిని వదిలేసిందని చెప్పారు. ఏక్యూ ఖాన్ అంటే తమకు ఇష్టమని, అతడితో కలిసి పనిచేస్తున్నామని సౌదీ చెప్పినట్లు వెల్లడించారు. అమెరికా-సౌదీ సంబంధం గురించి మాట్లాడుతూ.. సౌదీ నుంచి అమెరికా చమురు కొనుగోలు చేస్తుంది, వారు అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తారని చెప్పారు. సౌదీ అరేబయా, చైనా, భారత్ తమ వ్యూహాత్మక అవసరాలను పునర్నిర్వచించుకున్నందున ప్రపంచ శక్తి గతిశీలత మారుతోందని కిరియాకౌఅన్నారు.
తాజావార్తలు
-
Super Splendor: హీరో నుంచి కొత్త స్ల్పెండర్ బైక్ వచ్చేసింది.. అదరిపోయిన ఫీచర్స్.. తక్కువ ధరలోనే..
-
IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
-
Musical Drama : గొంతు క్యాన్సర్ తో పోరాడే రేడియో జాకీ… నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ ఎమోషనల్ డ్రామా
-
Telangana Congress: గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల డిష్యూం.. డిష్యూం.. చొక్కాలు పట్టుకుని మరీ..
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!