Zika virus: జికా వైరస్ కలకలం.. ముంబైలో రెండో కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zika virus: ఒకేసారి డెంగీ, మలేరియా, లెప్టో వ్యాధులు సోకి ఒక బాలుడు ముంబైలో మరణించాడు. ఈ ఘటన మరవక ముందే ముంబైలో జికా వైరస్ కలకలం మొదలైంది. ముంబైలో రెండో వైరస్ కేసుల నమోదైంది. 15 ఏళ్ల బాలిక జ్వరంతో ఆస్పత్రిలో చేరగా, పరీక్షలు నిర్వహించి జికా వైరస్ గా తేల్చారు. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ముంబైలో రెండో జికా వైరస్ కేసు నమోదైందని బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మంగళవారం తెలిపింది. అంతకుముందు ఆగస్టు 23న తొలి కేసు నమోదైంది.
తూర్పు ముంబైలోని కుర్లాకు చెందిన 15 ఏళ్ల బాలికకు జికా వైరస్ కోసినట్లు అధికారులు తెలిపారు. వ్యాధి తాలూకు లక్షణాలతో బాధపడుతున్న బాలిక ఆగస్టు 20న జ్వరం, తలనొప్పితో బాధపడుతున్న బాలిక మొదటగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ఆ తరువాత ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
Read Also: Rishi Sunak: ఇండియాతో వాణిజ్య ఒప్పందానికి సిద్ధమే.. కానీ..
జికా వైరస్ ప్రధానంగా ఏడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మహిళలకు గర్భధారణ సమయంలో ఈ వైరస్ సోకితే పుట్టే పిల్లలు కొన్ని లోపాలతో పుట్టే అవకాశం ఉంది. జ్వరం, శరీంపై దద్దుర్లు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కళ్లు ఎర్రబడటం, కండరాల నొప్పులు జికా వ్యాధి లక్షణాలుగా ఉంటాయి. జికా వ్యాధికి వ్యాక్సిన్ లేదు. దీనికి సరైన మందులు కూడా లేవు. అయితే లక్షణాలను అనుసరించి చికిత్స చేస్తారు. అంతకుముందు చెంబూర్ కు చెందిన 79 ఏళ్ల వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?