Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా మృతిలో బీజేపీ నేతకు పోలీసుల సమన్లు..
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశ మృతి కేసు..
- బీజేపీ నేత నితీష్ రాణేకి పోలీసులు సమన్లు..
- హత్యా ఆరోపణలకు సంబంధించి ఆధారాలు అడిగే అవకాశం..
- గత ప్రభుత్వం ఆదిత్యఠాక్రేని కాపాడిందని రాణే ఆరోపణలు..
Sushant Singh Rajput: బాలీవుడ్ స్టార్, దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ మృతి కేసులో బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణేకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. శుక్రవారం తమ ముందు హాజరుకావాలని నోటీసలు పంపారు. 2020లో సుశాంత్ మరణించిన తర్వాత అతని మాజీ మేనేజర్ దిశా మరణించింది. ఈ కేసులోనే బీజేపీ నేతకు సమన్లు జారీ అయ్యాయి. దిశ మృతి హత్య అని, ఆమె హత్యకు గురైందని రాణే పేర్కొన్నారు.
Read Also: Poonam Kaur: ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడు.. వైరల్ అవుతున్న పూనమ్ కౌర్ ట్వీట్
Also Read
ఎమ్మెల్యే నితీస్ రాణేని మాల్వానీ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని పోలీసులు కోరారు. హత్యకు గురైందనే వాదనకు సంబంధించి కీలక విషయాలు, ఏదైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని పోలీసులు కోరవచ్చు. ‘‘నాకు ఇప్పుడే సమన్లు అందాయి. ఇది హత్య కేసు అని నేను మొదటి రోజు నుంచి చెబుతున్నాను. నేను ముంబై పోలీసులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను.గత మహావికాస్అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం ఆదిత్య ఠాక్రే. అతని స్నేహితులని రక్షించాలని అనుకుంది. నా వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా, పోలీసులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని నితీష్ రాణే తెలిపారు.
ముంబైలోని సబర్బన్ బాంద్రాలోని తన ఫ్లాట్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉరివేసుకుని మరణించాడు. దీనికి కొన్ని రోజుల ముందు అతని జూన్ 8, 2020లో దిశ చనిపోయింది. మృతిపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు గతేడాది ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ కేసును ముంబై పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా నమోదు చేశారు.
#WATCH | BJP leader Nitesh Rane says, "I have just received the summons and I have been saying this since day one that this is a case of murder. I am ready to cooperate with the Mumbai Police. The MVA government wanted to do a cover-up & save Aditya Thackeray and his other… https://t.co/BkiqPWTdit pic.twitter.com/xSh3mMHvh1
— ANI (@ANI) July 11, 2024
తాజావార్తలు
-
Maoists Surrender : తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
-
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
-
DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!