Disney India: అంబానీ చేతికి డిస్నీ ఇండియా..? అదే జరిగితే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disney India: ప్రముఖ అమెరికన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాల్ట్ డిస్నీ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిస్నీ తన వ్యాపారాన్ని భారతదేశంలో విక్రయించాలని చూస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. టెలివిజన్తో సహా మొత్తం డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని విక్రయించడానికి పలువురు కొనుగోలుదారులు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్బెర్గ్ న్యూస్ నివేదించింది. ఇప్పటికే భారతదేశంలో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా డిస్నీ ఇండియాను కొనుగోలు చేసే రేసులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరైన కొనుగోలుదారు దొరికితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు స్పోర్ట్స్ హక్కులను ఒకేసారి విక్రయించాలని వాల్ట్ డిస్నీ భావిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్కు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోల్పోయిన సంగతి తెలిసిందే. రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 హక్కులను సొంతం చేసుకుంది. జియో టీవీ ద్వారా ఐపీఎల్ ఫ్రీ స్ట్రీమింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి డిస్నీ హాట్ స్టార్ సబ్స్క్రైబర్లు తగ్గుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే భారత్లో తమ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించడం లేదా జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయడం వంటి ఎంపికలను వారు పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజా బ్లూమ్బెర్గ్ నివేదిక కూడా డిస్నీ ఇండియా వ్యాపారాన్ని విక్రయించడానికి చర్చలు ప్రారంభించినట్లు పేర్కొంది. మరోవైపు ఈ విషయమై జరుగుతున్న చర్చలు డీల్ కుదరకపోవచ్చని పలువురు పేర్కొంటుండడం గమనార్హం. డిస్నీ ప్రతినిధి ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అవకాశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని, అవసరమైనప్పుడు పూర్తి వివరాలను వెల్లడిస్తామని రిలయన్స్ అధికారిక ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు, క్రికెట్ వ్యాపారానికి సంబంధించిన డిజిటల్ హక్కులు కోల్పోయినప్పటికీ, టీవీ హక్కులు 2027 వరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చేతిలోనే ఉన్నాయి. ఈ డీల్ కుదిరితే డిస్నీ ఇండియా వ్యాపారం రిలయన్స్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. , అప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారంలో ముఖేష్ అంబానీకి పోటీ ఉండదు. ఇప్పటికీ IPL ఉచిత స్ట్రీమింగ్తో, Jio TV సబ్స్క్రైబర్లలో భారీ పెరుగుదలను చూసింది. ఐపీఎల్ను ఉచితంగా ప్రసారం చేసినప్పటికీ కోట్లాది రూపాయల వ్యాపారం జరిగిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వయంగా ప్రకటించింది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
తాజావార్తలు
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. జీతంలో 1.5% కట్.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!