Disney India: అంబానీ చేతికి డిస్నీ ఇండియా..? అదే జరిగితే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disney India: ప్రముఖ అమెరికన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాల్ట్ డిస్నీ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిస్నీ తన వ్యాపారాన్ని భారతదేశంలో విక్రయించాలని చూస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. టెలివిజన్తో సహా మొత్తం డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని విక్రయించడానికి పలువురు కొనుగోలుదారులు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్బెర్గ్ న్యూస్ నివేదించింది. ఇప్పటికే భారతదేశంలో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా డిస్నీ ఇండియాను కొనుగోలు చేసే రేసులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరైన కొనుగోలుదారు దొరికితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు స్పోర్ట్స్ హక్కులను ఒకేసారి విక్రయించాలని వాల్ట్ డిస్నీ భావిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్కు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోల్పోయిన సంగతి తెలిసిందే. రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 హక్కులను సొంతం చేసుకుంది. జియో టీవీ ద్వారా ఐపీఎల్ ఫ్రీ స్ట్రీమింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి డిస్నీ హాట్ స్టార్ సబ్స్క్రైబర్లు తగ్గుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే భారత్లో తమ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించడం లేదా జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయడం వంటి ఎంపికలను వారు పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజా బ్లూమ్బెర్గ్ నివేదిక కూడా డిస్నీ ఇండియా వ్యాపారాన్ని విక్రయించడానికి చర్చలు ప్రారంభించినట్లు పేర్కొంది. మరోవైపు ఈ విషయమై జరుగుతున్న చర్చలు డీల్ కుదరకపోవచ్చని పలువురు పేర్కొంటుండడం గమనార్హం. డిస్నీ ప్రతినిధి ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అవకాశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని, అవసరమైనప్పుడు పూర్తి వివరాలను వెల్లడిస్తామని రిలయన్స్ అధికారిక ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు, క్రికెట్ వ్యాపారానికి సంబంధించిన డిజిటల్ హక్కులు కోల్పోయినప్పటికీ, టీవీ హక్కులు 2027 వరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చేతిలోనే ఉన్నాయి. ఈ డీల్ కుదిరితే డిస్నీ ఇండియా వ్యాపారం రిలయన్స్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. , అప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారంలో ముఖేష్ అంబానీకి పోటీ ఉండదు. ఇప్పటికీ IPL ఉచిత స్ట్రీమింగ్తో, Jio TV సబ్స్క్రైబర్లలో భారీ పెరుగుదలను చూసింది. ఐపీఎల్ను ఉచితంగా ప్రసారం చేసినప్పటికీ కోట్లాది రూపాయల వ్యాపారం జరిగిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వయంగా ప్రకటించింది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
తాజావార్తలు
-
CJP Protest: బ్రిక్స్ సదస్సుకు ముందే కాక్రోచ్ నిరసన ఎందుకు..?
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి కారణమిదేనా? వెలుగులోకి ఇస్రో కీలక ఆధారాలు
-
Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్లో కొత్త టూరిజం హబ్
-
Lunar Eclipse 2026: ఆ ఏడాది చంద్రగ్రహణం: సమయం, ప్రభావాలు, చేయాల్సిన పనులు ఇవే
-
Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?