Disney India: అంబానీ చేతికి డిస్నీ ఇండియా..? అదే జరిగితే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disney India: ప్రముఖ అమెరికన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాల్ట్ డిస్నీ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిస్నీ తన వ్యాపారాన్ని భారతదేశంలో విక్రయించాలని చూస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. టెలివిజన్తో సహా మొత్తం డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని విక్రయించడానికి పలువురు కొనుగోలుదారులు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్బెర్గ్ న్యూస్ నివేదించింది. ఇప్పటికే భారతదేశంలో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా డిస్నీ ఇండియాను కొనుగోలు చేసే రేసులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరైన కొనుగోలుదారు దొరికితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు స్పోర్ట్స్ హక్కులను ఒకేసారి విక్రయించాలని వాల్ట్ డిస్నీ భావిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్కు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోల్పోయిన సంగతి తెలిసిందే. రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 హక్కులను సొంతం చేసుకుంది. జియో టీవీ ద్వారా ఐపీఎల్ ఫ్రీ స్ట్రీమింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి డిస్నీ హాట్ స్టార్ సబ్స్క్రైబర్లు తగ్గుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే భారత్లో తమ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించడం లేదా జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయడం వంటి ఎంపికలను వారు పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజా బ్లూమ్బెర్గ్ నివేదిక కూడా డిస్నీ ఇండియా వ్యాపారాన్ని విక్రయించడానికి చర్చలు ప్రారంభించినట్లు పేర్కొంది. మరోవైపు ఈ విషయమై జరుగుతున్న చర్చలు డీల్ కుదరకపోవచ్చని పలువురు పేర్కొంటుండడం గమనార్హం. డిస్నీ ప్రతినిధి ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అవకాశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని, అవసరమైనప్పుడు పూర్తి వివరాలను వెల్లడిస్తామని రిలయన్స్ అధికారిక ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు, క్రికెట్ వ్యాపారానికి సంబంధించిన డిజిటల్ హక్కులు కోల్పోయినప్పటికీ, టీవీ హక్కులు 2027 వరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చేతిలోనే ఉన్నాయి. ఈ డీల్ కుదిరితే డిస్నీ ఇండియా వ్యాపారం రిలయన్స్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. , అప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారంలో ముఖేష్ అంబానీకి పోటీ ఉండదు. ఇప్పటికీ IPL ఉచిత స్ట్రీమింగ్తో, Jio TV సబ్స్క్రైబర్లలో భారీ పెరుగుదలను చూసింది. ఐపీఎల్ను ఉచితంగా ప్రసారం చేసినప్పటికీ కోట్లాది రూపాయల వ్యాపారం జరిగిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వయంగా ప్రకటించింది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
తాజావార్తలు
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!