Disney India: అంబానీ చేతికి డిస్నీ ఇండియా..? అదే జరిగితే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disney India: ప్రముఖ అమెరికన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాల్ట్ డిస్నీ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిస్నీ తన వ్యాపారాన్ని భారతదేశంలో విక్రయించాలని చూస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. టెలివిజన్తో సహా మొత్తం డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని విక్రయించడానికి పలువురు కొనుగోలుదారులు చర్చలు జరుపుతున్నారని బ్లూమ్బెర్గ్ న్యూస్ నివేదించింది. ఇప్పటికే భారతదేశంలో డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కూడా డిస్నీ ఇండియాను కొనుగోలు చేసే రేసులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సరైన కొనుగోలుదారు దొరికితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు స్పోర్ట్స్ హక్కులను ఒకేసారి విక్రయించాలని వాల్ట్ డిస్నీ భావిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్కు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోల్పోయిన సంగతి తెలిసిందే. రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 హక్కులను సొంతం చేసుకుంది. జియో టీవీ ద్వారా ఐపీఎల్ ఫ్రీ స్ట్రీమింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి డిస్నీ హాట్ స్టార్ సబ్స్క్రైబర్లు తగ్గుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే భారత్లో తమ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించడం లేదా జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయడం వంటి ఎంపికలను వారు పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజా బ్లూమ్బెర్గ్ నివేదిక కూడా డిస్నీ ఇండియా వ్యాపారాన్ని విక్రయించడానికి చర్చలు ప్రారంభించినట్లు పేర్కొంది. మరోవైపు ఈ విషయమై జరుగుతున్న చర్చలు డీల్ కుదరకపోవచ్చని పలువురు పేర్కొంటుండడం గమనార్హం. డిస్నీ ప్రతినిధి ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అవకాశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని, అవసరమైనప్పుడు పూర్తి వివరాలను వెల్లడిస్తామని రిలయన్స్ అధికారిక ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు, క్రికెట్ వ్యాపారానికి సంబంధించిన డిజిటల్ హక్కులు కోల్పోయినప్పటికీ, టీవీ హక్కులు 2027 వరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చేతిలోనే ఉన్నాయి. ఈ డీల్ కుదిరితే డిస్నీ ఇండియా వ్యాపారం రిలయన్స్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. , అప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారంలో ముఖేష్ అంబానీకి పోటీ ఉండదు. ఇప్పటికీ IPL ఉచిత స్ట్రీమింగ్తో, Jio TV సబ్స్క్రైబర్లలో భారీ పెరుగుదలను చూసింది. ఐపీఎల్ను ఉచితంగా ప్రసారం చేసినప్పటికీ కోట్లాది రూపాయల వ్యాపారం జరిగిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వయంగా ప్రకటించింది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!