BJP: ప్రధాని నివాసంలో సీఎంల ఎంపికపై కీలక సమావేశం.. రాజీనామా చేసిన ఎంపీలు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి సూపర్ కిక్ ఇచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉండటంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కైవసం చేసుకుంది. దీంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలన్నింటిలో బీజేపీనే అధికారంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.
ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాలకు సీఎంలను ఎన్నుకునే అంశంపై ప్రధాని నరేంద్రమోడీ అధికారిక నివాసంలో బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశం జరుగుతోంది. ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షా, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎంపీ పదవులకు రాజీనామా చేసిన 10 మంది ఎంపీలు కూడా హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికపై నిన్న కూడా సమావేశం జరిగింది.
Also Read
- Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
Read Also: Amit Shah: పీఓకే కూడా మనదే, అక్కడ 24 సీట్లు రిజర్వ్.. జమ్మూకాశ్మీర్లో పెరిగిన సీట్లు..
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. ఇక మధ్యప్రదేశ్లో అధికారం నిలుపుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా సీఎం అభ్యర్థి ఎవరనేది చెప్పకుండానే బీజేపీ పోటీకి దిగి ఘన విజయం సాధించింది. అయితే ఈసారి కొత్త ముఖాలను సీఎం అభ్యర్థులుగా ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వసుంధర రాజే, రమణ్ సింగ్ సీఎంలుగా పనిచేశారు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. మాజీ సీఎం వసుంధర రాజేతో పాటు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీపీ జోషి, సీనియర్ నేత కిరోరి లాల్ మీనా సీఎం రేసులో ఉన్నారు.
రాజీనామా చేసిన ఎంపీల్లో మధ్యప్రదేశ్కి చెందిన నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. రాజస్థాన్ నుండి, రాజీనామా సమర్పించిన ఎంపీలలో రాజ్యవర్ధన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా మరియు దియా కుమారి ఉన్నారు. ఇక ఛత్తీస్గఢ్ నుంచి అరుణ్ సావో, గోమతి సాయి ఉన్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న బాబా బాలక్ నాథ్, రేణుకా సింగ్ ఇంకా రాజీనామా చేయకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..