BJP: ప్రధాని నివాసంలో సీఎంల ఎంపికపై కీలక సమావేశం.. రాజీనామా చేసిన ఎంపీలు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి సూపర్ కిక్ ఇచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉండటంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కైవసం చేసుకుంది. దీంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలన్నింటిలో బీజేపీనే అధికారంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.
ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాలకు సీఎంలను ఎన్నుకునే అంశంపై ప్రధాని నరేంద్రమోడీ అధికారిక నివాసంలో బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశం జరుగుతోంది. ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షా, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎంపీ పదవులకు రాజీనామా చేసిన 10 మంది ఎంపీలు కూడా హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికపై నిన్న కూడా సమావేశం జరిగింది.
Also Read
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
Read Also: Amit Shah: పీఓకే కూడా మనదే, అక్కడ 24 సీట్లు రిజర్వ్.. జమ్మూకాశ్మీర్లో పెరిగిన సీట్లు..
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. ఇక మధ్యప్రదేశ్లో అధికారం నిలుపుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా సీఎం అభ్యర్థి ఎవరనేది చెప్పకుండానే బీజేపీ పోటీకి దిగి ఘన విజయం సాధించింది. అయితే ఈసారి కొత్త ముఖాలను సీఎం అభ్యర్థులుగా ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వసుంధర రాజే, రమణ్ సింగ్ సీఎంలుగా పనిచేశారు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. మాజీ సీఎం వసుంధర రాజేతో పాటు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీపీ జోషి, సీనియర్ నేత కిరోరి లాల్ మీనా సీఎం రేసులో ఉన్నారు.
రాజీనామా చేసిన ఎంపీల్లో మధ్యప్రదేశ్కి చెందిన నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. రాజస్థాన్ నుండి, రాజీనామా సమర్పించిన ఎంపీలలో రాజ్యవర్ధన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా మరియు దియా కుమారి ఉన్నారు. ఇక ఛత్తీస్గఢ్ నుంచి అరుణ్ సావో, గోమతి సాయి ఉన్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న బాబా బాలక్ నాథ్, రేణుకా సింగ్ ఇంకా రాజీనామా చేయకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
-
Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?