BJP: ప్రధాని నివాసంలో సీఎంల ఎంపికపై కీలక సమావేశం.. రాజీనామా చేసిన ఎంపీలు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి సూపర్ కిక్ ఇచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉండటంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కైవసం చేసుకుంది. దీంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలన్నింటిలో బీజేపీనే అధికారంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.
ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాలకు సీఎంలను ఎన్నుకునే అంశంపై ప్రధాని నరేంద్రమోడీ అధికారిక నివాసంలో బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశం జరుగుతోంది. ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షా, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎంపీ పదవులకు రాజీనామా చేసిన 10 మంది ఎంపీలు కూడా హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికపై నిన్న కూడా సమావేశం జరిగింది.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Read Also: Amit Shah: పీఓకే కూడా మనదే, అక్కడ 24 సీట్లు రిజర్వ్.. జమ్మూకాశ్మీర్లో పెరిగిన సీట్లు..
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. ఇక మధ్యప్రదేశ్లో అధికారం నిలుపుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా సీఎం అభ్యర్థి ఎవరనేది చెప్పకుండానే బీజేపీ పోటీకి దిగి ఘన విజయం సాధించింది. అయితే ఈసారి కొత్త ముఖాలను సీఎం అభ్యర్థులుగా ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వసుంధర రాజే, రమణ్ సింగ్ సీఎంలుగా పనిచేశారు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. మాజీ సీఎం వసుంధర రాజేతో పాటు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీపీ జోషి, సీనియర్ నేత కిరోరి లాల్ మీనా సీఎం రేసులో ఉన్నారు.
రాజీనామా చేసిన ఎంపీల్లో మధ్యప్రదేశ్కి చెందిన నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. రాజస్థాన్ నుండి, రాజీనామా సమర్పించిన ఎంపీలలో రాజ్యవర్ధన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా మరియు దియా కుమారి ఉన్నారు. ఇక ఛత్తీస్గఢ్ నుంచి అరుణ్ సావో, గోమతి సాయి ఉన్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న బాబా బాలక్ నాథ్, రేణుకా సింగ్ ఇంకా రాజీనామా చేయకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!