BJP: ప్రధాని నివాసంలో సీఎంల ఎంపికపై కీలక సమావేశం.. రాజీనామా చేసిన ఎంపీలు హాజరు..
BJP: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి సూపర్ కిక్ ఇచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉండటంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కైవసం చేసుకుంది. దీంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలన్నింటిలో బీజేపీనే అధికారంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.
ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాలకు సీఎంలను ఎన్నుకునే అంశంపై ప్రధాని నరేంద్రమోడీ అధికారిక నివాసంలో బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశం జరుగుతోంది. ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షా, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎంపీ పదవులకు రాజీనామా చేసిన 10 మంది ఎంపీలు కూడా హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికపై నిన్న కూడా సమావేశం జరిగింది.
Also Read
- Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
Read Also: Amit Shah: పీఓకే కూడా మనదే, అక్కడ 24 సీట్లు రిజర్వ్.. జమ్మూకాశ్మీర్లో పెరిగిన సీట్లు..
5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. ఇక మధ్యప్రదేశ్లో అధికారం నిలుపుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా సీఎం అభ్యర్థి ఎవరనేది చెప్పకుండానే బీజేపీ పోటీకి దిగి ఘన విజయం సాధించింది. అయితే ఈసారి కొత్త ముఖాలను సీఎం అభ్యర్థులుగా ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వసుంధర రాజే, రమణ్ సింగ్ సీఎంలుగా పనిచేశారు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. మాజీ సీఎం వసుంధర రాజేతో పాటు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, రాష్ట్ర బీజేపీ చీఫ్ సీపీ జోషి, సీనియర్ నేత కిరోరి లాల్ మీనా సీఎం రేసులో ఉన్నారు.
రాజీనామా చేసిన ఎంపీల్లో మధ్యప్రదేశ్కి చెందిన నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. రాజస్థాన్ నుండి, రాజీనామా సమర్పించిన ఎంపీలలో రాజ్యవర్ధన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా మరియు దియా కుమారి ఉన్నారు. ఇక ఛత్తీస్గఢ్ నుంచి అరుణ్ సావో, గోమతి సాయి ఉన్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న బాబా బాలక్ నాథ్, రేణుకా సింగ్ ఇంకా రాజీనామా చేయకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
-
MI Captain Hardik: వరుస వైఫల్యాలతో సతమతం.. ముంబై ఇండియన్స్ను వీడనున్న హార్దిక్ పాండ్యా..
-
Tollywood : బీస్ట్ మోడ్లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
-
Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
-
Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!