Telangana MP Komatireddy Venkat Reddy and Andhra Pradesh MP Keshineni Nani Meet with Union Minister Nitin Gadkari for Hyderabad-Vijayawada 6 line Highway Development.
హైదరాబాద్— విజయవాడ హైవే గురించి భువనగిరి లోకసభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు కేంద్ర రోడ్డు భవనాల మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ – విజయవాడ హైవే 6 లైన్ల విస్తరణకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే నెలలోనే పనులు ప్రారంభించాలని జీఎంఆర్ సంస్థకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు పలు ఇతర అంశాలను కూడా కేంద్ర మంత్రి తో ఎంపీ కోమటిరెడ్డి చర్చించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించడం, ఎక్స్ ప్రెస్ హైవేగా విస్తరించడం.
ఎన్హెచ్ 30 ఇబ్రహీంపట్నం – అమరావతి కనెక్టివిటీ. విజయవాడ- నాగపూర్ కొత్త ఎక్స్ప్రెస్ హైవే. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు లను వెడల్పు చేయడం. మహానాడు రోడ్డు, రామవరపాడు, ఎనికేపాడు T జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ ల నిర్మాణం. విస్సన్నపేట గ్రామానికి బైపాస్ నిర్మించడం. విజయవాడ నగరానికి కొత్త తూర్పు బైపాస్ నిర్మించడం. గొల్లపూడి బైపాస్ నిర్మాణం పనులు వేగవంతం చేయడం గురించి కూడా కేంద్రమంత్రితో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రితో పాటు కేంద్ర రవాణా, రహదారుల సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్, రోడ్డు ట్రాన్ పోర్ట్ సెక్రటరీ, ఎన్హెచ్ఐ ఛైర్మెన్, ఎన్హెచ్ఏఐ అధికారులు, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.