Odisha: అప్పటికే 11 మంది పిల్లలు.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందని భార్యను గెంటేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha: తనకు అప్పటికే 11 మంది పిల్లలు. చాలీచాలని బతుకులు. రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబం. దీంతో ఆ మహిళ భర్తకు చెప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (ట్యూబెక్టబీ ఆపరేషన్) చేయించుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆధునిక యుగంలో ఉన్న కూడా కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాల మత్తు వీడటం లేదు. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో జరిగింది. మూడు రోజుల క్రితం తన భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో జానకి దేహూరి తన పిల్లలతో కలిసి దిమిరియా గ్రామంలోని తన ఇంటి బయటే ఉంటోంది.
ప్రతీ సంవత్సరం పిల్లలకు జన్మనివ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి స్థానిక ఆశా కార్యకర్త ద్వారా ఒప్పించడంతో మహిళ ట్యూబెక్టమీకి వెళ్లాలని నిర్ణయించుకుంది. పెళ్లయిన 11 ఏళ్లలో ఆమె 11 మంది పిల్లలకు జన్మనిచ్చింది, అయితే వారిలో ఒకరు మరణించారు. నా పిల్లలు పెరుగుతున్నప్పుడు ప్రతీ సంవత్సరం గర్భం దాల్చడం చాలా ఇబ్బందిగా ఉందని.. మా ఊరి ఆడవాళ్లు చాలా మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా.. నా భర్త అర్థం చేసుకోకుండా నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని జానకి చెబుతోంది.
Also Read
- కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
- Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
- Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
- CM Vijay: సీఎం విజయ్కు షాక్.. కాన్వాయ్లోకి దూకిన దంపతులు.. పోలీసులు హడల్
Read Also: Gujarat: మేనల్లుడి పెళ్లి.. జనాలపై నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్..
మరోవైపు ఆపరేషన్ చేయించుకుని భార్య నేరం చేసిందని ఆరోపిస్తున్నాడు ఆమె భర్త రవి. మేము భూయాన్ కమ్యూనిటికి చెందిన వారమని.. సమాజంలో ఉన్న నమ్మకం ప్రకారం ఆడవాళ్లకు ఆపరేషన్ చేస్తే నీళ్లు రావని.. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానం రవి దేహూరీ అన్నారు. ఒక వేళ భార్య ఇంట్లోకి వచ్చేప్రయత్నం చేస్తే చంపేందుకు మారణాయుధాలతో ఇంటి ముందే తిరుగుతున్నాడు.
తరచూ గర్భం దాల్చడం వల్ల జానకీ ఆరోగ్యం దెబ్బతిందని.. గర్భం దాల్చలేనంత బలహీనంగా మారిందని.. 10 మంది పిల్లలను పెంచడం కుటుంబానికి కష్టం అవుతోందని ఆశా వర్కర్ విజయ లక్ష్మీ బిస్వాల్ అన్నారు. దీంతో అధికారులు రవిని ఒపించి అతని భార్యను ఇంట్లోకి రానివ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంతకు ఒప్పుకోకపోవడంతో అధికారులు జానకీ, ఆమె పిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించి, భర్త రవిపై పోలీసుకు ఫిర్యాదు చేస్తామని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
-
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
-
Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
-
Raids: మాదాపూర్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!