Uttar Pradesh: స్పోర్ట్స్ బైక్ కొనివ్వలేదని భార్యకు విడాకులు.. షాక్తో అత్త మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother-in-law dies of shock after man divorces wife: వరకట్న వేధింపులు ఒకరి ప్రాణాలన్ని బలితీశాయి. భార్యకు విడాకులు ఇవ్వడంతో ఈ వార్త విని యువతి తల్లి మరణించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. వివరాల్లోకి వెళితే లక్నోలో ఓ వ్యక్తి స్పోర్ట్స్ బైక్ కొనేందుకుందు కట్నం డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రిపుల్ తలాక్ ఇచ్చి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో షాక్ కు గురైన యువతి తల్లి మరణించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
పోలీసుల సమాచారం ప్రకారం.. లక్నోలోని అమీనాబాద్ చికామండి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తునన మహిళకు లాహర్ పూర్ సీతాపూర్ కు చెందిన మహ్మద్ యూనస్ అనే వ్యక్తితో 2021లో వివాహం జరిగింది. వివాహం తరువాత మహిళ అత్తమామలు కట్నం డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఇరు కుటుంబాలు రాజీకి వచ్చి యువకుడి కుటుంబం రూ. 2 లక్షలు అడిగారు.
అయితే ఈ డబ్బు కోసం ప్రతీ రోజు సదరు వ్యక్తి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. మహిళ కట్నం డబ్బు తీసుకురాకపోవడంతో కొట్టి ఇంటి నుంచి గెంటేశాడు. కాగా.. బాధితురాలు రూ. 2లక్షలు ఇవ్వడానికి నిరాకరించడంతో ఫోన్ లో త్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఈ విషయం తెలిసి బాధితురాలి తల్లి షాక్ కు గురై మరణించింది. ఈ ఘటన తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని డీసీపీ చిరంజీవి నాథ్ సిన్హా తెలిపారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!