Gangster: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక వ్యక్తి, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ మహ్మద్ గౌస్ నియాజీని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దక్షిణాఫ్రికాలో అరెస్ట్ చేసింది. నియాజీపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. 2016లో బెంగళూర్లో ఆర్ఎస్ఎస్ నేత రుద్రేష్ని హత్య చేసిన కేసులో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన తర్వాత నియాజీ విదేశాలకు పారిపోయాడు. అప్పటి నుంచి దర్యాప్తు అధికారులు ఇతడి కోసం వెతుకుతున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాలో పట్టుబడటం ఎన్ఐఏకి గొప్ప విజయంగా చెప్పవచ్చు.
Read Also: Nuclear Cargo: చైనా నుంచి పాక్ వెళ్తున్న నౌకని ముంబైలో నిలిపివేత.. “అణు కార్గో” ఉన్నట్లు అనుమానం..
గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) నియాజీ కదలికలపై నిఘా పెట్టింది. ఈ వివరాలను కేంద్ర ఏజెన్సీలతో పంచుకుంది. దక్షిణాఫ్రికా అధికారులను అప్రమత్తం చేశారు. రుద్రేష్ హత్య ఆ సమయంలో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత నిందితుడిని భారత్కి అప్పగించే పని ప్రారంభమైంది. త్వరలోనే ముంబైకి నిందితుడిని తీసుకురానున్నారు.