Indigo: సిక్ లీవ్ పేరుతో ఉద్యోగులంతా ఇంటర్వ్యూలకి.. విమాన రాకపోకలు ఆలస్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగోకు సంబంధించిన విమానాలు శనివారం పెద్ద సంఖ్యలో ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. ఆ సంస్థకు చెందిన 55 శాతం మంది సిక్లీవ్లో వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్లైన్స్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు చాలా వరకు సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. శనివారం ఒక్కరోజే దాదాపు 900 సర్వీసులపై ఈ ప్రభావం పడినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించిది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ.. ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి వివరణ కోరింది. అయితే, సిక్లీవ్ పెట్టిన సిబ్బంది అంతా ఎయిర్ ఇండియా నిర్వహిస్తోన్న ఉద్యోగ నియామకాల ఇంటర్వ్యూల కోసం వెళ్లినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇండిగో సంస్థ నిత్యం దాదాపు 1600 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను నడిపిస్తోంది. ఇందులో శనివారం చాలా సర్వీసులు నడవలేదు. ఆదివారం కూడా ఇదే విధమైన సమస్య తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్పందించారు. ఈ పరిణామంపై దృష్టి సారించామని అన్నారు. అయితే, దీనిపై ఇండిగో మాత్రం స్పందించలేదు.
Also Read
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
Tomato Prices: మొన్నటివరకూ భారీ ధర…ఇప్పుడేమో నేలచూపులు
ఎయిర్ ఇండియాను ఈ ఏడాది జనవరి 27న కేంద్రం.. టాటా గ్రూప్కు తిరిగి అప్పగించింది. గతేడాది అక్టోబర్ 8న వేసిన బిడ్డింగ్లో గెలిచి విమానయాన సంస్థ నిర్వహణ, నియంత్రణను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది టాటా గ్రూప్. ఈ నేపథ్యంలోనే కొత్త విమానాలను కొనుగోలు చేసి సేవల్ని మెరుగుపర్చుకోవాలని చూస్తున్న ఎయిర్ ఇండియా ఇటీవలే రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రారంభించింది. ఈ ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిలో చాలా మంది సిక్ లీవ్లో ఉండటం, ఎయిరిండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ హాజరు కావడానికి వెళ్లడంతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలిసింది. టాటా గ్రూప్ సొంతమైన ఎయిరిండియాలో ఫేస్ 2 రిక్రూట్మెంట్ డ్రైవ్ శనివారం నిర్వహించారు. చాలా మంది క్యాబిన్ క్రూ మెంబర్లు సిక్ లీవ్ పెట్టి, ఎయిరిండియా రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొనేందుకు వెళ్లారని అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!