Teenage pregnancy: ఆందోళకరంగా, టీనేజ్ అమ్మాయిల్లో పెరుగుతున్న ప్రెగ్నెన్సీలు..
- టీనేజ్ అమ్మాయిల్లో పెరుగుతున్న ప్రెగ్నెన్సీలు..
- కర్ణాటక నివేదికలో వెల్లడి..
- సోషల్ మీడియా, ఇంటర్నెట్, అవగాహన లేకపోవడం కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teenage pregnancy: ఇటీవల కాలంలో టీనేజ్ అమ్మాయిల్లో ప్రెగ్రెన్సీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కర్నాటకలో 2021-22 నుంచి 2023-24 వరకు ఏకంగా 33,621 టీనేజ్ అమ్మాయిలు గర్భం దాల్చినట్లు ఒక నివేదిక వెల్లడించింది. సామాజిక ఆర్థిక అంశాలతో పాటు ఇంటర్నెట్ ప్రభావం, కుటుంబ అస్థిరత ఈ ధోరణికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్దకాలంలో ఇలాంటి విస్తృత ధోరణి ఇటీవల కాలంలోనే కనిపిస్తోంది.
జిల్లాల వారీగా చూసుకుంటే.. బెంగళూరు అర్బన్లో అత్యధికంగా 4,324 టీనేజ్ గర్భాలు నమోదయ్యాయి. విజయనగర్ (2,468 కేసులు), బళ్లారి (2,283), బెలగావి (2,224), మరియు మైసూరు (1,930) జిల్లాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. సామాజిక పరిస్థితులు, సోషల మీడియా, ఇంటర్నెట్ వినియోగం, సమగ్రమైన లైంగిక విద్య లేకపోవడం కూడా ఈ పరిస్థితులకు కారణమని నివేదిక వెల్లడించింది.
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
Read Also: Swati Maliwal: హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్.. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి స్వాతి మాలివాల్ నిరసన
కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ నాగన్న గౌడ మాట్లాడుతూ.. టీనేజర్లు అనుచితమైన కంటెంట్కి గురికావడంలో సోషల్ మీడియా పాత్రను నొక్కి చెప్పారు. ఇది వారి జీవిత ప్రారంభంలోనే ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తోందని చెప్పారు. ‘‘టీనేజర్లు తరుచుగా ఆన్లైన్లో చూసే వాటి ద్వారా ప్రభావితమవుతారు. హఠాత్తు నిర్ణయాలు వారి సంబంధాలకు దారితీస్తున్నాయి. ఇది ఊహించని విధంగా గర్భాలకు దారితీస్తోంది’’ అని అన్నారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. వార్షిక టీనేజ్ గర్భధారణ కేసుల్ని సూచించింది. 2021-22లో 11,792 కేసులు ఉండగా, 2022-23లో అది 13,198కి పెరిగింది, ఆ తర్వాత 2023-24లో 8,631కి తగ్గింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఎన్జీవోలు, ఇతర సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?