Teenage pregnancy: ఆందోళకరంగా, టీనేజ్ అమ్మాయిల్లో పెరుగుతున్న ప్రెగ్నెన్సీలు..
- టీనేజ్ అమ్మాయిల్లో పెరుగుతున్న ప్రెగ్నెన్సీలు..
- కర్ణాటక నివేదికలో వెల్లడి..
- సోషల్ మీడియా, ఇంటర్నెట్, అవగాహన లేకపోవడం కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teenage pregnancy: ఇటీవల కాలంలో టీనేజ్ అమ్మాయిల్లో ప్రెగ్రెన్సీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కర్నాటకలో 2021-22 నుంచి 2023-24 వరకు ఏకంగా 33,621 టీనేజ్ అమ్మాయిలు గర్భం దాల్చినట్లు ఒక నివేదిక వెల్లడించింది. సామాజిక ఆర్థిక అంశాలతో పాటు ఇంటర్నెట్ ప్రభావం, కుటుంబ అస్థిరత ఈ ధోరణికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గత దశాబ్దకాలంలో ఇలాంటి విస్తృత ధోరణి ఇటీవల కాలంలోనే కనిపిస్తోంది.
జిల్లాల వారీగా చూసుకుంటే.. బెంగళూరు అర్బన్లో అత్యధికంగా 4,324 టీనేజ్ గర్భాలు నమోదయ్యాయి. విజయనగర్ (2,468 కేసులు), బళ్లారి (2,283), బెలగావి (2,224), మరియు మైసూరు (1,930) జిల్లాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. సామాజిక పరిస్థితులు, సోషల మీడియా, ఇంటర్నెట్ వినియోగం, సమగ్రమైన లైంగిక విద్య లేకపోవడం కూడా ఈ పరిస్థితులకు కారణమని నివేదిక వెల్లడించింది.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: Swati Maliwal: హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్.. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి స్వాతి మాలివాల్ నిరసన
కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ నాగన్న గౌడ మాట్లాడుతూ.. టీనేజర్లు అనుచితమైన కంటెంట్కి గురికావడంలో సోషల్ మీడియా పాత్రను నొక్కి చెప్పారు. ఇది వారి జీవిత ప్రారంభంలోనే ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తోందని చెప్పారు. ‘‘టీనేజర్లు తరుచుగా ఆన్లైన్లో చూసే వాటి ద్వారా ప్రభావితమవుతారు. హఠాత్తు నిర్ణయాలు వారి సంబంధాలకు దారితీస్తున్నాయి. ఇది ఊహించని విధంగా గర్భాలకు దారితీస్తోంది’’ అని అన్నారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. వార్షిక టీనేజ్ గర్భధారణ కేసుల్ని సూచించింది. 2021-22లో 11,792 కేసులు ఉండగా, 2022-23లో అది 13,198కి పెరిగింది, ఆ తర్వాత 2023-24లో 8,631కి తగ్గింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఎన్జీవోలు, ఇతర సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!