Karnataka: కర్ణాటకలో విషాదం.. గోదాములో ధాన్యం బస్తాల కింద చిక్కుకున్న 10 మందికి పైగా కార్మికులు.. ఏడుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో విషాదం వెలుగు చూసింది. బ్రతుకు దెరువుకు బీహార్ నుండి కర్ణాటకకు వలస వచ్చిన కార్మికులు మృత్యువాత పడ్డారు. వివరాల లోకి వెళ్తే.. కర్ణాటక లోని విజయపుర లోని రాజ్గురు ఇండస్ట్రీస్ లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో విషాదం వెలుగు చూసింది. సోమవారం రాత్రి గోదాములో స్టోరేజీ యూనిట్ కూలిపోయింది. దీనితో ఆ సమయంలో కార్మికులు కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మందికి పైగా కార్మికులు మొక్కజొన్న బస్తాల కింద చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో బస్తాల కింద చిక్కుకున్న కార్మికులలో ముగ్గురిని రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Read also:Cyclone Michuang Updates: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. వేలాది ఎకరాల్లో పంట నష్టం!
Also Read
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
కాగా 7 మంది కార్మికులు చనిపోయారు. కాగా వారిలో 6 మంది మృత దేహాలను బస్తాల కింద నుండి అతి కష్టం పైన బయటకు తీశారు. మృతులు రాజేష్ ముఖియా (25), రాంబ్రీజ్ ముఖియా (29), శంభు ముఖియా (26), లుఖో జాదవ్ (45), రామ్ బాలక్ (52)గా గుర్తించారు. మరొకరి మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటన పైన పోలీసులు మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయిన రాజ్గురు ఇండస్ట్రీస్లో కార్మికులు విధుల్లో ఉండగా ప్రమాధవశాత్తు స్టోరేజీ యూనిట్ కూలిపోయిందని.. ఈ నేపథ్యంలో మొక్కజొన్న బస్తాలతో కూడిన అనేక సెట్ల నిల్వ యూనిట్లు ఒకేసారి పడిపోవడంతో 10 మంది కార్మికులు ఆబస్తాల కింద చిక్కుకున్నారని.. అయితే చుకుకున్నవారిలో ఊపిరిరాడక 7 మంది మృతి చెందారని.. ముగ్గురుని రక్షించి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించామని వెల్లడించారు. కాగా కార్మికులందరూ బీహార్ కి చెందివారుగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?