Summer Heatwave: ఈ వేసవి చాలా హాట్ గురూ.. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు..
Summer Heatwave: ఈ ఏడాది వేసవి మరింత హాట్గా ఉండబోతున్నట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) హెచ్చరించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ సోమవారం తెలిపింది. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల నిర్వహణకు దేశం సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఎండలు ప్రభావం చూపించే అవకాశం ఉంది.
గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో వడగాలుల తీవ్ర ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. బెంగళూర్, హైదరాబాద్ వంటి నగరాలతో సహా అనేక నగరాల్లో ఉష్ణోగ్రతల కారణంగా నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే సాగు చేస్తున్న గోధుమలతో పాటు ఇతర పంటలపై దీని ప్రభావం ఉంటుందని చెప్పింది.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
వేసవి వేడితో ఎలా వ్యవహరించాలనే సలహాలను రాష్ట్రాలకు జారీ చేసినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) సెక్రటరీ మెంబర్ కమల్ కిషోర్ చెప్పారు. ర్యాలీలు లేదా పెద్ద రాజకీయ సమావేశాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఎన్నికల కమిషన్కి లేఖ రాసింది. తూర్పు, ఈశాన్య, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో మూడు నెలల వ్యవధిలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈసారి ఏప్రిల్ నెలలోనే వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.
రాయలసీమ, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, మధ్య మహరాష్ట్ర మీదుగా కొన్ని ప్రదేశాల్లో 40-42 డిగ్రీ సెల్సియస్ పరిధిలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. తూర్పు ఉత్తర ప్రదేశ్, మధ్య మహారాస్ట్రలో చాలా చోట్ల కనిష్ణ ఉష్ణోగ్రత కూడా సాధారణం కన్నా 3-5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుంది.
ఎల్ నినోనే ప్రధాన కారణం:
వాతావరణ నిపుణులు మాత్రం ఎల్ నినో ప్రభావం కారణంగా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర జలాలు వేడెక్కడాన్ని ఎల్ నినోగా అభివర్ణిస్తుంటారు. ఈ పరిణామం రుతుపవనాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ ఏడాది ఏర్పడిన ఎల్ నినో ఇప్పటి వరకు నమోదైన బలమైన వాటిలో ఒకటి. ఎల్ నినో సగటున ప్రతీ రెండు నుంచి 7 ఏళ్లకు సంభవిస్తుంటుంది. సాధారణంగా తొమ్మిది నుంచి 12 నెలల వరకు ఉంటుంది.
తాజావార్తలు
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!