Jaishankar: నెహ్రూ భారత్ని కాదని చైనాకు శాశ్వత సభ్యదేశ హోదా కల్పించారు.. పటేల్ హెచ్చరికల్ని పట్టించుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో శాశ్వత సభ్య దేశంగా భారత్కి ముందుగా అవకాశం వచ్చిందని, అయితే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కారణంగా అది చైనాకు దక్కిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. అహ్మదాబాద్లోని గుజరాత్ ఛాంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి ముప్పు పొంచి ఉందని సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూని ఎలా హెచ్చరించారనే విషయాలను పంచుకున్నారు.
Read Also: Annamalai: డీఎంకే తమిళనాడుకి శత్రువు.. కోయంబత్తూర్ రోడ్ షోలో అన్నామలై..
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
నెహ్రూ ఇండియా కంటే ముందు చైనాకు యూఎన్ఎస్సీలో శాశ్వత సభ్యదేశంగా స్థానం కల్పించాలని అనుకున్నారని జైశంకర్ అన్నారు. 1950లో సర్దార్ పటేల్, నెహ్రూ మధ్య సమావేశం జరిగింది. దీంట్లో పటేల్ చైనా ముప్పు గురించి నెహ్రూని హెచ్చరించారు. ఈ రోజు మనం రెండు వైపు(పాకిస్తాన్, చైనా) నుంచి ముప్పు ఎదుర్కొంటున్నామని పటేల్ చెప్పారు. చైనీయులు ఏది మాట్లాడినా, వారి ఉద్దేశం మంచిది కాదని తాను భావిస్తు్న్నానని అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని, దీనిపై ఒక విధానాన్ని రూపొందించాలని పటేల్ హెచ్చరించారు. అయితే నెహ్రూ మాత్రం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు’’ అని జైశంకర్ అన్నారు.
‘‘ చైనీయులను మీరు అనవసరంగా అనుమానిస్తున్నారని నెహ్రూ, పటేల్తో అన్నారు. హిమాలయాల మీదుగా మనపై దాడి చేయడం అసాధ్యం. యూఎన్లో శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని చర్చ జరిగింది. అయితే, ఈ స్థానాన్ని ముందుగా చైనాకు ఇవ్వాలని అని నెహ్రూ చెప్పారు. కాబట్టి ఈ రోజు మనం మొదట భారత్ గురించి మాట్లాడుతున్నాం. ఒకప్పుడు చైనా గురించి మాట్లాడిన సందర్భం అది’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లవద్దని సర్దార్ పటేల్ వైఖరిని కూడా నెహ్రూ పట్టించుకోలేదని, గత దశాబ్ధ కాలంగా కేంద్రంలో బీజేపీ వారసత్వంగా వచ్చిన సమస్యలతో వ్యహరిస్తోందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?