Maha Kumbh Mela: కుంభమేళాలో మహా రికార్డు.. అమెరికా జనాభాను మించి..
- కుంభమేళాలో మహా రికార్డు
- అమెరికా జనాభాను మించి భక్తుల రాక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళా మరో రికార్డ్ సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు ఊహించని రీతిలో భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దాదాపు అగ్ర రాజ్యం అమెరికా జనాభా కంటే రెండు రెట్లు అధికంగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేశారు. అమెరికా ప్రస్తుత జనాభా 34 కోట్లు మంది ఉన్నారు. అలాంటిది ప్రయాగ్రాజ్కు ఇప్పటి వరకు 60 కోట్ల మందికి పైగా తరలివచ్చి పుణ్యస్నానాలు చేసినట్లుగా ఇప్పటికే యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ఈ కుంభమేళ ముగియనుంది. ఈ సందర్భంగా కోట్లాదిగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో అత్యధికంగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తారని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Share Market Holiday: మహాశివరాత్రి నాడు స్టాక్ మార్కెట్ మూతపడుతుందా లేదా ?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. దాదాపు 6 వారాల పాటు ఈ ఉత్సవం సాగుతోంది. ఈ కుంభమేళా 2 వేల సంవత్సరాలు క్రితం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ కుంభమేళా కొనసాగుతోంది. ఈ కుంభమేళాకు వచ్చే భక్తులంతా పాపాలు పోయి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది.
ఫిబ్రవరి 26న ముగిసే నాటికి యాత్రికుల సంఖ్య దాదాపు అర బిలియన్ వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైలు, విమానాలు, బస్సులు, కార్లు.. ఇలా రకరకాలైన ట్రావెలింగ్ ద్వారా భక్తులు తరలివచ్చారు. ఇక యూపీ ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం 7,500 ఫుట్బాల్ మైదానాల కంటే పెద్ద విస్తీర్ణంలో తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. 150,000 టాయిలెట్లు, 30 తేలియాడే వంతెనలు, 70,000 వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఇక తప్పిపోయే వారి కోసం 24 గంటలు పని చేసేలా 10 సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఈ వారంలో కూల్చేస్తారు. ఇక జనవరి 29న తొక్కిసలాట కారణంగా 30 మంది చనిపోయారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కూడా తొక్కిసలాట కారణంగా 18 మంది చనిపోయారు.
ఇది కూడా చదవండి: Elephants Attack: ఏనుగుల దాడిలో భక్తుల మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..