Elephants Attack: ఏనుగుల దాడిలో భక్తుల మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన..
- అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో భక్తులు మృతి..
- తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు..
- బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం హామీ..
- మృతుల కుటుంబాలకి రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున..
- ఆర్థిక సాయం అందించాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephants Attack: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి (మం) గుండాలకొన అటవీ ప్రాంతంలో భక్తుల బృందంపై ఏనుగుల దాడి… మహాశివరాత్రికి గుండాలకోన మీదుగా నడుచు కుంటూ తలకోనకు వెళుతున్న 14 మంది భక్తులకు తారసపడ్డాయి ఏనుగులు.. అయితే, భయంతో పరుగులు తీసిన భక్తులపై ఒక్కసారిగా ఏనుగులు దాడి చేశాయి.. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్టుగా చెబుతున్నారు.. అయితే, దినేష్ (30) చంగల్ రాయుడు (35) మన్నెమ్మ (35) అనే ముగ్గురు అక్కడికి అక్కడే మృతిచెందగా.. అమ్ములు (13),రాజా (29) తో పాటు మరొకరికి తీవ్ర గాయాలు, మరో నలుగురు సురక్షితంగా బయటపడినట్టు చెబుతున్నారు.. సంఘటన స్థలానికి అటవీశాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది చేరుకున్నాయి.. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత సహా పలువరు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Also: Maha Kumbh Mela: కుంభమేళాలో మరో రికార్డ్! చీపురుపట్టిన 15 వేల మంది కార్మికులు
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన ఆలయం వద్ద ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే దాడిలో మరికొందరు గాయపడిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు.. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఘటన వివరాలు తెలుసుకున్న ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. మృతుల కుటుంబాలకి రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ కు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్..
Read Also: New Ration Cards: పదేళ్ల తర్వాత నెరవేరుతున్న పేదల కల.. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు!
ఇక, ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత.. ఏనుగుల దాడిలో భక్తులు మృతి చెందడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లకై ఆదేశించారు.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ తరపున అండగా ఉంటామని వెల్లడించారు.. ఓబులవారిపల్లి మండలం వై కోట సమీపంలోని గుండాల కోనలో ఉన్న ఈశ్వరుడి దర్శనానికి వెళ్లే భక్తులకు మరింత భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.. ఈ దురదృష్టకర సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.. ఇదే దాడిలో మరికొందరు గాయపడడంపై విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారుల్ని ఆదేశించాను.. బాధిత కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!