Momos Eating: మోమోస్ పందెం.. యువకుడి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Momos Eating: సరదా కోసం వేసే పందాలు ఒక్కోసారి సీరియస్గా మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలుగా మారుతుంటాయి. అలాంటిదే మోమోస్ తినే పందం. మోమోస్ తినే పందెంలో 150 మోమోస్ తింటానని పందెం కాసిన యువకుడు.. పందెం అనంతరం అస్వస్థకు గురై మరణించాడు. ఈ బీహార్లో జరిగింది. . బీహార్లోని గోపాల్గంజ్కు చెందిన బిపిన్ కుమార్ పాశ్వాన్(25) మొబైల్ రిపేర్ షాపు నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం పాశ్వాన్ తన స్నేహితులను కలిశాడు. అందరూ కలిసి ముచ్చటిస్తుండగా, మోమోలు ఎవరు ఎక్కుత తింటారో చూద్దామని ఫ్రెండ్స్ పందెం కాశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోపాల్గంజ్లో కొందరు స్నేహితులు ఎంజాయ్ చేస్తూ, వారిలోవారు మోమోస్ ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నారు. దీనిలో పాల్గొన్న బిపిన్ కుమార్ ఛాలెంజ్కు మించి అధికంగా మూమూస్ తిన్నాడు. దీంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. బిపిన్ పరిస్థితిని గమనించిన అతని స్నేహితులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాశ్వాన్ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read also: Trains Cancelled: తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే
Also Read
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
బిపిన్ మృతి నేపధ్యంలో అతని తండ్రి మాట్లాడుతూ తన కుమారుని చేత విషం తినిపించారని, తన కుమారుడిని అతని స్నేహితులే హత్య చేశారని ఆరోపించారు. వారంతా ఉద్దేశపూర్వకంగానే ఈ ఛాలెంజ్ చేసి, తన కుమారుడని హత్యచేశారని ఆరోపించారు. తన కుమారుడిపై అతని స్నేహితులు విష ప్రయోగం జరిపారని పాశ్వాన్ తండ్రి ఆరోపించారు. పాశ్వాన్ను కావాలనే చంపారని పేర్కొన్నాడు. కావాలనే మోమోస్లో విషం నింపి, పందెం కాశారని, అవి తినడంతో చనిపోయాడని అతని తండ్రి పేర్కొన్నాడు. తమ కుమారుడి మృతి కేసులో విచారణ జరిపి, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mahabharata Unknown Facts: మహాభారతంలో ఆ నలుగురు ఆయుధం పట్టి ఉంటే.. కురుక్షేత్రం రిజల్ట్ వేరేలా ఉండేది! ఆ మహావీరులు ఎవరో తెలుసా?
-
Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
-
Haiku : ‘కోర్ట్’ శ్రీదేవి సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ‘నెట్ఫ్లిక్స్’ మైండ్ బ్లాక్ డీల్
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!