PM Modi: ఎన్నికల ముంగిట నేడు బెంగాల్కు మోడీ.. వందే భారత్ స్లీపర్ను ప్రారంభించనున్న ప్రధాని
- ఎన్నికల ముంగిట బెంగాల్కు మోడీ
- నేడు వందే భారత్ స్లీపర్ ట్రైన్ను ప్రారంభించనున్న ప్రధాని
- త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధాన పార్టీలు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే అధికారి పార్టీ తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య నువ్వా-నేనా? అన్నట్టుగా మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇంకోవైపు ఈడీతో టీఎంసీ ఫైట్ చేస్తోంది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణ సమయంలో ప్రధాని మోడీ ఈరోజు పశ్చిమ బెంగాల్కు వెళ్తున్నారు. ఈ పర్యటన పొలిటికల్గా ఆసక్తి రేపుతోంది.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్కు ట్రంప్ ధన్యవాదాలు.. దేనికోసమంటే..!
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ప్రధాని మోడీ శనివారం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా తొలుత హౌరా నుంచి గౌహతి మధ్య మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. అనంతరం మాల్డాలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రూ.3250 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి.. శంకుస్థాపనలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: BMC Elections : ఠాక్రే సోదరుల కలయిక విఫలం.. ముంబై కోటను కోల్పోయిన వారసులు..
హూగ్లీ జిల్లా సింగూర్లో రూ.830 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే బాలాగఢ్లో ఎక్స్టెండెడ్ పోర్ట్ గేట్ సిస్టమ్కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ను ఇతర రాష్ట్రాలతో అనుసంధానించేలా 7 అమృత్ భారత్ రైళ్లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
త్వరలోనే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం మమత ప్రయత్నిస్తుండగా.. ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తాపత్రాయపడుతోంది. ఇలా రెండు పార్టీల మధ్య భీకర యుద్ధం జరిగేలా కనిపిస్తోంది. ఇంకోవైపు ఎన్నికల సమయంలో ఈడీ దాడులు చేయడంతో కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ సర్కార్ మండిపడుతోంది.
I will be in West Bengal tomorrow, 17th January. At a programme in Malda, development works worth over Rs. 3250 crore would be inaugurated or their foundation stones would be laid. I am delighted that at the programme tomorrow, the first ever Vande Bharat sleeper train between…
— Narendra Modi (@narendramodi) January 16, 2026
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..