PM Modi: ఆపరేషన్ సిందూర్తో మన శక్తేంటో ప్రపంచం చూసింది.. కేబినెట్ భేటీలో మోడీ వ్యాఖ్య
- ఆపరేషన్ సిందూర్తో మన శక్తేంటో ప్రపంచం చూసింది
- కేబినెట్ భేటీలో మోడీ వ్యాఖ్య
ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత శక్తేంటో ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోడీ అన్నారు. బుధవారం మోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సహచర మంత్రులకు ఆపరేషన్ సిందూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించారు. ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచ దేశాలు మన బలాన్ని చూశాయని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Indian Railways: భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ బుకింగ్ సమయంలో ఈ-ఆధార్ తప్పనిసరి
Also Read
ఇక జూన్ 9తో ఎన్డీఏ-3 ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 11 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో వివరించాలని కేంద్రమంత్రులకు మోడీ సూచించారు. చేసిన పనులు, ప్రాజెక్టులు గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు. అనవసరంగా గత ప్రభుత్వాలతో పోలికలు పెట్టుకోవద్దని కోరారు. ఆ సమయం అయిపోయింది.. ఇంకా పోలికలు పెట్టడం ఏ మాత్రం భావ్యం కాదన్నారు.
ఇది కూడా చదవండి: AB Venkateswara Rao: లాసెట్ రాసిన రిటైర్ట్ ఐపీఎస్ ఆఫీసర్..
గత ప్రభుత్వ హయాంలో నిర్ణయాలు తీసుకోవడానికి రోజులు పట్టేవని.. ఇప్పుడు అలా కాదని.. కేవలం 22 నిమిషాల్లోనే ఆపరేషన్ ముగించేసినట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లో తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. మన లక్ష్యాలు పెద్దవి.. సమయం తక్కువగా ఉందని.. అందుకే శ్రద్ధగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల్లో నాణ్యత, సామర్థ్యం, ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలని కోరారు. ప్రపంచం మనల్ని గమనిస్తోందని.. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు.
ఇక అన్ని మంత్రిత్వ శాఖలు త్వరలో కొత్తగా నిర్మించిన సెంట్రల్ విస్టా సచివాలయానికి మారతాయని మోడీ వెల్లడించారు. దీంతో సమయం ఆదాతో పాటు మంత్రిత్వ సమన్వయం కూడా సానుకూలంగా ఉంటుందని వివరించారు.
ఎన్డీఏ సర్కార్ 3.0 ఏర్పడి జూన్ 9 నాటికి ఏడాది పూర్తికానుంది. దీంతో మోడీ 11 ఏళ్ల పాటు నిరంతరాయంగా ప్రధాని పదవిలో కొనసాగడం విశేషం. ఇక 2027లో జనాభా లెక్కలు, కుల గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 22 నిమిషాల్లో 100 మంది ఉగ్రవాదులను హతమార్చారు. ఇక పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. ఇలా త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతం అయింది.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!