Delhi: రాష్ట్రపతితో మోడీ, అమిత్ షా వరుస భేటీలు.. ఆంతర్యమిదేనా?
- రాష్ట్రపతితో మోడీ, అమిత్ షా వరుస భేటీలు
- రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా వరుస భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఆదివారం గంట వ్యవధిలోనే ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దేశ వ్యాప్తంగా రాజకీయ ఊహాగానాలు తీవ్రం అవుతున్నాయి. ఏదో జరుగుతుందని చర్చ నడుస్తోంది. ఇటీవల మోడీ బ్రిటన్, మాల్దీవుల పర్యటన చేపట్టారు. ఆ పర్యటన తర్వాత రాష్ట్రపతిని కలిశారు.
ఇది కూడా చదవండి: Shibu Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు పితృవియోగం.. శిబు సోరెన్ కన్నుమూత
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనా సభ సజావుగా నడవడం లేదు. ఆపరేషన్ సిందూర్పై చేపట్టిన చర్చ మాత్రమే కొంచెం ప్రశాంతంగా నడిచింది. మిగతా సమయం అంతా బీహార్లో చేపట్టిన ఓటర్ సర్వేపైనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. తక్షణమే సర్వేను నిలిపివేయాలని.. దానిపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Tamannaah : తమన్నా చెప్పిన లాలాజల చిట్కాపై హాట్ డిబేట్ – డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?
వాస్తవానికి ఈ సమావేశాల్లో అనేక బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం కసరత్తు చేసింది. కానీ సభ మాత్రం నడవడం లేదు. క్రీడా సంస్థల పనితీరులో ఎక్కువ పారదర్శకతను కల్పించే జాతీయ క్రీడా పాలన బిల్లును ఆమోదించేందుకు జాబితా చేసింది. అలాగే ఆగస్టు 13 నుంచి మణిపూర్లో రాష్ట్రపతి పాలనను ఆరు నెలల పాటు పొడిగించాలని హోంమంత్రి అమిత్ షా చేసిన తీర్మానం ఆమోదానికి జాబితా చేసింది. కానీ సభ సరిగ్గా నడవడం లేదు. అయితే ప్రతిపక్షాల నిరసనలను పట్టించుకోకుండా ఈ వారం ఉభయసభలు సజావుగా సాగించేందుకు అజెండాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతితో ఇరువురి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మోడీ భేటీపై అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడ లేదు.
బిల్లులు..
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం పార్లమెంటులో జాతీయ క్రీడా పాలన బిల్లు-2025ను ప్రవేశపెట్టనున్నారు. ఇక మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగించాలనే తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
Called on Hon’ble President Smt. Droupadi Murmu Ji at Rashtrapati Bhavan. pic.twitter.com/6hjgTcPAZD
— Amit Shah (@AmitShah) August 3, 2025
తాజావార్తలు
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!