MK Stalin: ఇజ్రాయిల్ మారణహోమం సృష్టిస్తోంది.. గాజా అనుకూల నిరసనల్లో స్టాలిన్..
- గాజా అనుకూల నిరసనల్లో పాల్గొన్న ఎంకే స్టాలిన్..
- ఇజ్రాయిల్ మారణహోమానికి పాల్పడుతోందని విమర్శలు..
- కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MK Stalin: గాజాపై ఇజ్రాయిల్ దాడులు ఆపేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, తక్షణ కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన గాజా అనుకూల నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. ఇజ్రాయిల్ విచక్షణారహిత దాడుల్ని సీఎం ఖండించారు. గాజాకు శాంతి, మానవతా సాయం అందించే ప్రయత్నాలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతూ అక్టోబర్ 14న తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు.
Read Also: Payal Gosh : తొమ్మిదేళ్లు శృంగారానికి దూరంగా ఉన్నా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
Also Read
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
గాజాపై ఇజ్రాయిల్ మారణహోమం ముగియాలని, రాజకీయాల కోసం ఈ నిరసనల్లో పాల్గొనలేదని, మానవత్వం కోసం పాల్గొన్నామని స్టాలిన్ అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని ఖండిస్తూనే, పాలస్తీనియన్లకు మానవ హక్కుల మద్దతు ఉంటుందని చెప్పారు. గతేడాది గాజాలో 50,000 మంది మరణించారని, ఇందులో 26 వేల మంది పిల్లలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇజ్రాయిల్ ప్రపంచ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు.
అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లిం వర్గాన్ని ఆకర్షించడానికి సీఎం ప్రయత్నిస్తున్నారనే విమర్శల్ని డీఎంకే తోసిపుచ్చింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. డీఎంకే ఎల్లప్పుడు అణిచివేతకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, అది శ్రీలంక తమిళ కోసం అయినా, పాలస్తీనా కోసమైనా అని అన్నారు. మరోవైపు మిత్రపక్షాలైన కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి కూడా సీఎంకు మద్దతు వచ్చింది. కాంగ్రెస్ ఎల్లప్పుడు పాలస్తీనాకు సపోర్ట్గా నిలబడిందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ కే. సెల్వపెరుంతగై అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!