Measles Outbreak: మహారాష్ట్రలో మీజిల్స్ విజృంభణ.. 700 దాటిన కేసుల సంఖ్య
Measles Outbreak in maharashtra, Mumbai Worst-Hit: మహారాష్ట్రను మీజిల్స్(తట్టు) వ్యాధి కలవరపెడుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 700కు మించి కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ముంబై నగరంలో చాలా వరకు కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి వల్ల 14మంది మరణించారు. పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేసే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక్క ముంబై నగరంలోనే 10 మంది మరణించారు. ముంబై ప్రాంతంలో నవంబర్ 28 నాటికి ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం కొత్తగా ముంబైలో మరో 5 మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయి. ఒక అనుమానాస్పద మరణం చోటు చేసుకుంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 717 మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఒక్క ముంబై నగరంలోనే 303 కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Fifa World Cup: ఇంటిదారి పట్టిన ఇరాన్.. సంబరాలు జరుపుకున్న ఇరాన్ ప్రజలు
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
వారంలో ఐదు అనుమానిత కేసులు ఉంటే..వాటిలో రెండు ప్రయోగశాలలో నిర్థారణ అయితే వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లుగా గుర్తిస్తారు. జనవరి నుంచి నాసిక్ జిల్లాలోని మాలేగావ్ లో 70 , ముంబై నగరంలోని భీవండీలో 48 మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయి. ముంబైలో జనవరి 1,2022 నుంచి 11,390 అనుమానిత కేసులు నమోదు అయ్యాయి. అధికార డేటా ప్రకారం రాష్ట్రంలో 2019లో 1,337 కేసులు, 2020లో 2,150 కేసులు, 2021లో 3,668 ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది తట్టు వ్యాధి వల్ల 14 మంది మరణిస్తే ఇందులో ఒక్కరు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్లు తేలింది. మరణించిన వారిలో నలుగురు 0-11 నెలల వయసు గల పిల్లలు ఉన్నారు. 8 మంది 12-24 నెలల వయసు ఉన్న వారు ఉన్నారు. అయితే ఇద్దరు 25-60 ఏళ్ల వయస్సు ఉన్న పెద్దవాళ్లు కూడా ఉన్నారు. పెరుగుతున్న కేసులు, మరణాల దృష్ట్యా ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!