Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్.. ఆకాష్ ఆనంద్ ను అన్ని పదవుల నుంచి తొలగింపు
- మేనల్లుడికి మాయావతి షాక్
- ఆకాష్ ఆనంద్ ను అన్ని పదవుల నుంచి తొలగింపు
- పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) రాజకీయ పార్టీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. బీఎస్పీ అధినేత్రి తన మేనల్లుడికి షాక్ ఇచ్చింది. ఆకాశ్ ఆనంద్ ను పార్టీ అన్ని పదవుల నుంచి తొలగించింది. దీంతో పార్టీకి ఇద్దరు కొత్త జాతీయ సమన్వయకర్తలు వచ్చారు. ఆకాష్ ఆనంద్ స్థానంలో ఆయన తండ్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా మాయావతి నియమించారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఈరోజు లక్నోలో జరిగిన పార్టీ ముఖ్యమైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read:Bhumana Karunakar Reddy: ఎన్నాళ్లీ మోసం.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి!
Also Read
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
ఈ సమావేశంలో పలు రాష్ట్రాల అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాష్ ఆనంద్ను బీఎస్పీ అన్ని పదవుల నుంచి తొలగించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాయావతి సోదరుడు ఆనంద్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ కూడా పార్టీ సమావేశానికి హాజరయ్యారు. కానీ, ఆకాష్ ఆనంద్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.
Also Read:Uttar Pradesh: పెంపుడు పిల్లి మరణంతో కుంగిపోయి.. తిరిగి బ్రతికి వస్తుందన్న ఆశతో చూసి.. చివరకు
గత ఏడాది మేలో, మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త, ఆమె వారసుడి పదవి నుంచి తొలగించారు. డిసెంబర్ 2023లో బిఎస్పి అధినేత్రి ఆయనను తన వారసుడిగా ప్రకటించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయావతి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆకాష్ ఆనంద్ రాజకీయంగా పూర్తి పరిణితి చెందే వరకు రెండు ముఖ్యమైన బాధ్యతల నుంచి దూరంగా ఉంటారని ఆమె తెలిపారు. కాగా గతంలో ఆకాష్ ఆనంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీతాపూర్లోని బీజేపీ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాద ప్రభుత్వం’గా ఆకాష్ ఆనంద్ అభివర్ణించారు. దీంతో అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో మాయావతి ఆకాష్ ఆనంద్ ను బీఎస్సీ పార్టీ పదవుల నుంచి తొలగించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!