Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్.. ఆకాష్ ఆనంద్ ను అన్ని పదవుల నుంచి తొలగింపు
- మేనల్లుడికి మాయావతి షాక్
- ఆకాష్ ఆనంద్ ను అన్ని పదవుల నుంచి తొలగింపు
- పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) రాజకీయ పార్టీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. బీఎస్పీ అధినేత్రి తన మేనల్లుడికి షాక్ ఇచ్చింది. ఆకాశ్ ఆనంద్ ను పార్టీ అన్ని పదవుల నుంచి తొలగించింది. దీంతో పార్టీకి ఇద్దరు కొత్త జాతీయ సమన్వయకర్తలు వచ్చారు. ఆకాష్ ఆనంద్ స్థానంలో ఆయన తండ్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా మాయావతి నియమించారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఈరోజు లక్నోలో జరిగిన పార్టీ ముఖ్యమైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read:Bhumana Karunakar Reddy: ఎన్నాళ్లీ మోసం.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి!
Also Read
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
- Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- Twisha Sharma: కోర్టు హాల్లో ఘర్షణ.. అత్త గారు అరుపులు.. భర్త చెంపపై కొట్టిన ట్విషా శర్మ లాయర్.. ఏం జరిగిందంటే..!
- Annamalai: బీజేపీకి గుడ్బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
ఈ సమావేశంలో పలు రాష్ట్రాల అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాష్ ఆనంద్ను బీఎస్పీ అన్ని పదవుల నుంచి తొలగించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాయావతి సోదరుడు ఆనంద్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ కూడా పార్టీ సమావేశానికి హాజరయ్యారు. కానీ, ఆకాష్ ఆనంద్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.
Also Read:Uttar Pradesh: పెంపుడు పిల్లి మరణంతో కుంగిపోయి.. తిరిగి బ్రతికి వస్తుందన్న ఆశతో చూసి.. చివరకు
గత ఏడాది మేలో, మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త, ఆమె వారసుడి పదవి నుంచి తొలగించారు. డిసెంబర్ 2023లో బిఎస్పి అధినేత్రి ఆయనను తన వారసుడిగా ప్రకటించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయావతి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆకాష్ ఆనంద్ రాజకీయంగా పూర్తి పరిణితి చెందే వరకు రెండు ముఖ్యమైన బాధ్యతల నుంచి దూరంగా ఉంటారని ఆమె తెలిపారు. కాగా గతంలో ఆకాష్ ఆనంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీతాపూర్లోని బీజేపీ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాద ప్రభుత్వం’గా ఆకాష్ ఆనంద్ అభివర్ణించారు. దీంతో అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో మాయావతి ఆకాష్ ఆనంద్ ను బీఎస్సీ పార్టీ పదవుల నుంచి తొలగించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
-
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
-
YS Jagan: అందుకే “మావిగన్” ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
-
Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
-
Bhatti Vikramarka : జర్నలిస్టులకు ఇళ్లు, ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’కి నెలకు రూ.150 కోట్లు.!
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!