Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్.. ఆకాష్ ఆనంద్ ను అన్ని పదవుల నుంచి తొలగింపు
- మేనల్లుడికి మాయావతి షాక్
- ఆకాష్ ఆనంద్ ను అన్ని పదవుల నుంచి తొలగింపు
- పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) రాజకీయ పార్టీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. బీఎస్పీ అధినేత్రి తన మేనల్లుడికి షాక్ ఇచ్చింది. ఆకాశ్ ఆనంద్ ను పార్టీ అన్ని పదవుల నుంచి తొలగించింది. దీంతో పార్టీకి ఇద్దరు కొత్త జాతీయ సమన్వయకర్తలు వచ్చారు. ఆకాష్ ఆనంద్ స్థానంలో ఆయన తండ్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా మాయావతి నియమించారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఈరోజు లక్నోలో జరిగిన పార్టీ ముఖ్యమైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read:Bhumana Karunakar Reddy: ఎన్నాళ్లీ మోసం.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి!
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఈ సమావేశంలో పలు రాష్ట్రాల అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాష్ ఆనంద్ను బీఎస్పీ అన్ని పదవుల నుంచి తొలగించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాయావతి సోదరుడు ఆనంద్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ కూడా పార్టీ సమావేశానికి హాజరయ్యారు. కానీ, ఆకాష్ ఆనంద్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.
Also Read:Uttar Pradesh: పెంపుడు పిల్లి మరణంతో కుంగిపోయి.. తిరిగి బ్రతికి వస్తుందన్న ఆశతో చూసి.. చివరకు
గత ఏడాది మేలో, మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త, ఆమె వారసుడి పదవి నుంచి తొలగించారు. డిసెంబర్ 2023లో బిఎస్పి అధినేత్రి ఆయనను తన వారసుడిగా ప్రకటించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయావతి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆకాష్ ఆనంద్ రాజకీయంగా పూర్తి పరిణితి చెందే వరకు రెండు ముఖ్యమైన బాధ్యతల నుంచి దూరంగా ఉంటారని ఆమె తెలిపారు. కాగా గతంలో ఆకాష్ ఆనంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీతాపూర్లోని బీజేపీ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాద ప్రభుత్వం’గా ఆకాష్ ఆనంద్ అభివర్ణించారు. దీంతో అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో మాయావతి ఆకాష్ ఆనంద్ ను బీఎస్సీ పార్టీ పదవుల నుంచి తొలగించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..