Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్.. ఆకాష్ ఆనంద్ ను అన్ని పదవుల నుంచి తొలగింపు
- మేనల్లుడికి మాయావతి షాక్
- ఆకాష్ ఆనంద్ ను అన్ని పదవుల నుంచి తొలగింపు
- పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) రాజకీయ పార్టీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. బీఎస్పీ అధినేత్రి తన మేనల్లుడికి షాక్ ఇచ్చింది. ఆకాశ్ ఆనంద్ ను పార్టీ అన్ని పదవుల నుంచి తొలగించింది. దీంతో పార్టీకి ఇద్దరు కొత్త జాతీయ సమన్వయకర్తలు వచ్చారు. ఆకాష్ ఆనంద్ స్థానంలో ఆయన తండ్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా మాయావతి నియమించారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఈరోజు లక్నోలో జరిగిన పార్టీ ముఖ్యమైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read:Bhumana Karunakar Reddy: ఎన్నాళ్లీ మోసం.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ సమావేశంలో పలు రాష్ట్రాల అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాష్ ఆనంద్ను బీఎస్పీ అన్ని పదవుల నుంచి తొలగించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాయావతి సోదరుడు ఆనంద్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ కూడా పార్టీ సమావేశానికి హాజరయ్యారు. కానీ, ఆకాష్ ఆనంద్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.
Also Read:Uttar Pradesh: పెంపుడు పిల్లి మరణంతో కుంగిపోయి.. తిరిగి బ్రతికి వస్తుందన్న ఆశతో చూసి.. చివరకు
గత ఏడాది మేలో, మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త, ఆమె వారసుడి పదవి నుంచి తొలగించారు. డిసెంబర్ 2023లో బిఎస్పి అధినేత్రి ఆయనను తన వారసుడిగా ప్రకటించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయావతి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆకాష్ ఆనంద్ రాజకీయంగా పూర్తి పరిణితి చెందే వరకు రెండు ముఖ్యమైన బాధ్యతల నుంచి దూరంగా ఉంటారని ఆమె తెలిపారు. కాగా గతంలో ఆకాష్ ఆనంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీతాపూర్లోని బీజేపీ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాద ప్రభుత్వం’గా ఆకాష్ ఆనంద్ అభివర్ణించారు. దీంతో అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో మాయావతి ఆకాష్ ఆనంద్ ను బీఎస్సీ పార్టీ పదవుల నుంచి తొలగించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
FIFA World Cup 2026: హోరాహోరీ పోరులో.. ఫ్రాన్స్పై 6-4తో ఇంగ్లండ్ ఘన విజయం.. కాంస్య పతకం కైవసం
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!