Massive Road Accident : రెండు బస్సులు ఢీ.. 8మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive Bus Accident at Uttar Pradesh
ఉత్తరప్రదేశ్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్వేపై బీహార్ నుండి ఢిల్లీ వెళ్తున్న రెండు డబుల్ డెక్కర్ బస్సులు వేగంగా ఢీకొన్నాయి. దీంతో రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించడంతో.. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8మంది మృత్యువాత పడ్డారు. అయితే.. బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు వెనుక నుంచి మరో డబుల్ డెక్కర్ బస్సును ఢీ కొట్టిందని చెబుతున్నారు స్థానికులు.
Also Read
ఈ ప్రమాదంలో బస్సు దగ్ధం కాగా.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని లక్నో ట్రామా సెంటర్కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఎక్స్ ప్రెస్వేపై దెబ్బతిన్న బస్సును క్రేన్ సహాయంతో తొలగించారు పోలీసులు. దీని కారణంగా ఎక్స్ ప్రెస్వేపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Crispy Ragi Vada: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! రాగి పిండితో సింపుల్గా కరకరలాడే వడలు
-
Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్కు వీసీకే మద్దతు
-
Ragi Sweet Bondalu : రుచికి తోడు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి బోండాలు.. పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు.!
-
Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
-
UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!