Rajastan: ఒకటవ ఏట పెళ్లి.. 20 ఏళ్ల తర్వాత వివాహాన్ని రద్దు చేసిన కోర్టు
Rajastan: 21 ఏళ్ల వయస్సులో మహిళ వివాహాన్ని కుటుంబ న్యాయస్థానం రద్దు చేసింది. అదేంటి ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా ఇంకా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా బాల్యవివాహాలు చేస్తూ అమ్మాయిల అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి ఘటన రాజస్థాన్లో జరిగింది. ఆ యువతి పోరాడి తన హక్కులను సాధించింది. రాజస్థాన్కు చెందిన రేఖ అనే అమ్మాయికి చిన్ననాటనే తన తాత చనిపోవడంతో తన గ్రామానికి చెందిన అబ్బాయితో ఏడాది వయసులో వివాహం చేశారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఆమె అత్తమామలు ఆమెను ‘గౌన’ (వివాహానికి సంబంధించిన ఆచారం) కోసం ఒత్తిడి చేశారు. ఆమె అప్పుడు ఏఎన్ఎం ఉద్యోగం సాధించడానికి సిద్ధమవుతోంది. ఆమె కల చెదిరిపోకూడదనుకుంది. కాబట్టి, ఆమె అంగీకరించడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆమె సారథి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అనే ఎన్జీవోను సంప్రదించింది. అనంతరం వారి సహకారంతో కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
Supreme Court: ప్రభుత్వ ఉద్యోగి అవినీతి సమాజానికి చేసిన నేరమే..
తొలుత లొంగిపోవడానికి ఇష్టపడని ఆమె అత్తమామలు కుల పంచాయితీ చేసి రూ.10 లక్షల నగదు జరిమానాతో రేఖ కుటుంబాన్ని బెదిరించారు. రేఖ బెదరకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గురువారం కుటుంబ న్యాయస్థానం ప్రిసైడింగ్ అధికారి ప్రదీప్ కుమార్ మోదీ వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వందేళ్ల నుంచి బాల్య వివాహాల దురాచారాన్ని రూపుమాపలేదని, ఇప్పుడు అందరూ కలిసి బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయాలని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశంతో ఆనందం వ్యక్తం చేసిన రేఖ, ఇది ఒక కల నిజమైందని.. ఇప్పుడు తాను ఏఎన్ఎం కావడంపై దృష్టి సారిస్తానని అన్నారు. “ఈరోజు నా పుట్టినరోజు. ఈ రోజు నాకు 21 ఏళ్లు మరియు ఈ రద్దు నాకు, నా కుటుంబానికి పుట్టినరోజు బహుమతిగా వచ్చింది” అని ఆమె ట్రస్ట్కు ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Players Caught Vaping: మ్యాచ్ మధ్యలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ప్లేయర్స్ వీళ్లే..
-
Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్ఫ్రెండ్పై కాదు.. బౌలింగ్పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో