Bombay High Court: “వైవాహిక వివాదాలు” మనదేశంలో తీవ్రమైన కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: వివాహ సంబంధ వివాదాల్లో పిల్లలను చరాస్థులుగా పరిగణిస్తున్నారని బాంబే హైకోర్టు మంగళవారం ఓ కేసులో వ్యాఖ్యానించింది. ఒక మహిళలను తన 15 ఏళ్ల కుమారుడితో థాయ్ లాండ్ నుంచి ఇండియాకు తిరిగిరావాలని ఆదేశించింది. పిల్లవాడు తన తండ్రి, తోబుట్టువులను కలుసుకోవచ్చని తీర్పు చెప్పింది. వైవాహిక వివాదాలు దేశంలో అత్యంత తీవ్రమైన కేసులని జస్టిస్ ఆర్డీ ధనుక, గౌరీ గాడ్సేలతో కూడిన బెంచ్ పేర్కొంది. పిల్లలపై తల్లిదండ్రుల హక్కుల కన్నా వారి సంక్షేమమే ముఖ్యమని పేర్కొంది.
థాయ్లాండ్లో తన తల్లితో కలిసి ఉంటున్న తన 15 ఏళ్ల కుమారుడిని కలవాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. విడిపోయిన తల్లిదండ్రుల కారణంగా బాలుడిపై తీవ్ర ప్రభావం పడుతుందని, తన తండ్రిని కలిసేందుకు పిల్లాడు ఆసక్తిగా ఉందని కోర్టు గమనించింది. మనదేశంలో వైవాహితక తగాదాలు అత్యంత తీవ్రంగా పోరాడే కేసులని, పిల్లలను ఆస్తులుగా పరిగనిస్తున్నారని పేర్కొంది. పిల్లల సంక్షేమం ప్రధానమైనదని, తల్లిదండ్రుల చట్టపరమైన హక్కులు కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
- PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
Read Also: Ram Charan: చరణ్ ఇంట్లో కుక్కలా పుట్టినా బావుండేది.. రైమ్ లక్కీ బేబీ
ఈ కేసులో విడిపోయిన జంటకు సంబంధించిన పెద్ద పిల్లలు ఒక కుమారుడు, కుమార్తె ఇద్దరు వారి తండ్రితోనే ఉంటున్నారు. సెప్టెంబర్ 2020లో కుటుంబ న్యాయస్థానం భార్య వద్ద ఉన్న బాలుడు తన తాతయ్యను, బాలుడి తోబుట్టువును కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. అయితే సదరు మహిళ వాటిని పాటించలేదని కేసు దాఖలు చేసిన ఆ వ్యక్తి పేర్కొన్నాడు. వేసవి సెలవుల్లో బాలుడిని ఇండియాకు తీసుకురావాలని మహిళను కోర్టు ఆదేశించింది.
అయితే సదరు మహిళ..తాను తన కొడుకుతో ఇండియాకు రావడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే వేసవి సెలువులు ముగిసిన తర్వాత థాయ్ లాండ్ తిరిగి వచ్చేలా అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని మహిళ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. బాలుడి ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, వాటిని గౌరవించడం అవసరం అని కోర్టు పేర్కొంది. తల్లిదండ్రులు అవసరాలు, పిల్లల సంక్షేమాన్ని సమతూకంగా పాటించాలని, పిల్లల అభిప్రాయాలను పరిగణించకపోతే అది వారి భవిష్యత్తుకు హానికరం అని హైకోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
The Paradise Trailer: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
-
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!