Bombay High Court: “వైవాహిక వివాదాలు” మనదేశంలో తీవ్రమైన కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: వివాహ సంబంధ వివాదాల్లో పిల్లలను చరాస్థులుగా పరిగణిస్తున్నారని బాంబే హైకోర్టు మంగళవారం ఓ కేసులో వ్యాఖ్యానించింది. ఒక మహిళలను తన 15 ఏళ్ల కుమారుడితో థాయ్ లాండ్ నుంచి ఇండియాకు తిరిగిరావాలని ఆదేశించింది. పిల్లవాడు తన తండ్రి, తోబుట్టువులను కలుసుకోవచ్చని తీర్పు చెప్పింది. వైవాహిక వివాదాలు దేశంలో అత్యంత తీవ్రమైన కేసులని జస్టిస్ ఆర్డీ ధనుక, గౌరీ గాడ్సేలతో కూడిన బెంచ్ పేర్కొంది. పిల్లలపై తల్లిదండ్రుల హక్కుల కన్నా వారి సంక్షేమమే ముఖ్యమని పేర్కొంది.
థాయ్లాండ్లో తన తల్లితో కలిసి ఉంటున్న తన 15 ఏళ్ల కుమారుడిని కలవాలని కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. విడిపోయిన తల్లిదండ్రుల కారణంగా బాలుడిపై తీవ్ర ప్రభావం పడుతుందని, తన తండ్రిని కలిసేందుకు పిల్లాడు ఆసక్తిగా ఉందని కోర్టు గమనించింది. మనదేశంలో వైవాహితక తగాదాలు అత్యంత తీవ్రంగా పోరాడే కేసులని, పిల్లలను ఆస్తులుగా పరిగనిస్తున్నారని పేర్కొంది. పిల్లల సంక్షేమం ప్రధానమైనదని, తల్లిదండ్రుల చట్టపరమైన హక్కులు కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Read Also: Ram Charan: చరణ్ ఇంట్లో కుక్కలా పుట్టినా బావుండేది.. రైమ్ లక్కీ బేబీ
ఈ కేసులో విడిపోయిన జంటకు సంబంధించిన పెద్ద పిల్లలు ఒక కుమారుడు, కుమార్తె ఇద్దరు వారి తండ్రితోనే ఉంటున్నారు. సెప్టెంబర్ 2020లో కుటుంబ న్యాయస్థానం భార్య వద్ద ఉన్న బాలుడు తన తాతయ్యను, బాలుడి తోబుట్టువును కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. అయితే సదరు మహిళ వాటిని పాటించలేదని కేసు దాఖలు చేసిన ఆ వ్యక్తి పేర్కొన్నాడు. వేసవి సెలవుల్లో బాలుడిని ఇండియాకు తీసుకురావాలని మహిళను కోర్టు ఆదేశించింది.
అయితే సదరు మహిళ..తాను తన కొడుకుతో ఇండియాకు రావడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే వేసవి సెలువులు ముగిసిన తర్వాత థాయ్ లాండ్ తిరిగి వచ్చేలా అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని మహిళ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. బాలుడి ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, వాటిని గౌరవించడం అవసరం అని కోర్టు పేర్కొంది. తల్లిదండ్రులు అవసరాలు, పిల్లల సంక్షేమాన్ని సమతూకంగా పాటించాలని, పిల్లల అభిప్రాయాలను పరిగణించకపోతే అది వారి భవిష్యత్తుకు హానికరం అని హైకోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!