PM Modi: ‘‘చంద్రయాన్-2’’ విఫలమైన రోజు రాత్రి నిద్ర పోలేదు.. వెళ్లొద్దని చాలా మంది చెప్పారు..
- చంద్రయాన్-2 విఫలమైన రోజు నిద్ర పోలేకపోయాను..
- చాలా మంది వెళ్లొద్దని సలహా ఇచ్చారు..
- ఆనాటి క్షణాలను పాడ్కాస్ట్లో వెల్లడించిన ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతీయ అంతరిక్ష విజయాల్లో ‘‘చంద్రయాన్’’ ప్రయోగానికి ప్రత్యేక స్థానం ఉంది. రెండేళ్ల క్రితం చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు ‘‘చంద్రయాన్-2’’ ప్రయోగం విఫలమైంది. ల్యాండింగ్ సమయంలో ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలింది.
‘‘చంద్రయాన్-2’’ ప్రయోగాన్ని ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించారు. అయితే, విఫలమైన తర్వాత ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాననే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ తన తొలి పాడ్కాస్ట్లో తెలిపారు. జెరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్కి ప్రధాని మోడీ హాజరయ్యారు.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
Read Also: CM Revanth Reddy: ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం..
చంద్రయాన్-2 ప్రయోగానికి హాజరుకావద్దని తనను చాలా మంది వారించారని చెప్పారు. ‘‘చాలా మంది నాకు చెప్పారు, సార్ మీరు అక్కడికి వెళ్లకూడదని. అలాంటి మిషన్ల చుట్టూ చాలా అనిశ్చితులు ఉంటాయి. చాలా దేశాలు తరచుగా 4-5 ప్రయత్నాల తర్వాత విజయం సాధిస్తాయి. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎలా ఉంటుంది’’ అని చాలా మంది తనకు సలహా ఇచ్చారని మోడీ చెప్పారు. దీనిపై ‘‘తనకు ఎలాంటి బాధ్యత లేదా..?’’ అని అడిగానని ప్రధాని అన్నారు.
చంద్రయాన్-2 చివరి క్షణాల్లో సాఫ్ట్ ల్యాండింగ్ విలఫమైంది. ‘‘ తనకు చెప్పడానికి ఎవరికీ ధైర్యం రావడం లేదు. అయితే, ఏదో తప్పు జరిగిందని గ్రహించాను. అది పనిచేయడం లేదు’’ అని ప్రధాని అన్నారు. ‘‘చివరకు ఒక సీనియర్ సైంటిస్టు తన వద్దకు వచ్చారని, అతడితో చింతించకండి’’ అని చెప్పినట్లు ప్రధాని వెల్లడించారు. ఆ రాత్రి తాను నిద్రపోలేకపోయానని, తర్వాత రోజుఉదయం 7 గంటలకు శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటు చేయమని చెప్పానని ప్రధాని గుర్తు చేసుకున్నారు.
‘‘ఇది దేశానికి చాలా పెద్ద ఎదురుదెబ్బ. కానీ నేను ఎదురుదెబ్బలకు ఏడ్చే వ్యక్తిని కాదు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తల వద్దకు వెళ్లి చెప్పాను. ఏదైనా వైఫల్యం ఉంటే, నేను బాధ్యత తీసుకుంటానని అన్నాను. మీరు ఒక ప్రయత్నం చేశారు, నిరాశ చెందొద్దని చెప్పారు. ఆ తర్వాత చంద్రయాన్ -3 విజయవంతం కావడం మనకు తెలిసిందే’’ అని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!